అనుకున్న ర్యాంకు రాలేదని యువతి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

అనుకున్న ర్యాంకు రాలేదని యువతి ఆత్మహత్య

Published Wed, Jun 6 2018 6:57 AM

మెడికల్‌ ఎంట్రన్స్‌ ‘నీట్‌’లో అనుకున్న ర్యాంక్‌ రాకపోవడంతో ఓ యువతి ప్రాణాలు తీసుకుంది. అందరూ చూస్తుండగానే పదో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. జిమ్‌కు వెళ్తున్నానని చెప్పి అంతలోనే విగతజీవిగా మారడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. హైదరాబాద్‌లోని అబిడ్స్‌ మయూర్‌ కుషాల్‌ కాంప్లెక్స్‌ వద్ద మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.