కేజ్రీవాల్‌ ఇంటికి 70మంది పోలీసులు | Delhi police accupy cm kejriwal house | Sakshi
Sakshi News home page

Feb 23 2018 1:23 PM | Updated on Mar 22 2024 11:13 AM

ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్‌పై దాడి విషయంలో ఢిల్లీ పోలీసులు కేజ్రీవాల్‌ ఇంటికి వచ్చారు. దాడికి సంబంధించిన ఆధారాలు దొరుకుతాయోమోనని ఇళ్లు మొత్తం సోదాలు నిర్వహించడం మొదలుపెట్టారు. ఈ చర్యను ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తీవ్రంగా ఖండించారు. తన ఇంట్లో సోదాలు చేయడం కాదని, పోలీసులకు దమ్ముంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాను లోయా కేసు విషయంలో ప్రశ్నించాలని డిమాండ్‌ చేశారు. మరోపక్క, ఆమ్‌ ఆద్మీ పార్టీ సీనియర్‌ నేతలు అశుతోష్‌, సంజయ్‌ సింగ్‌ పోలీసుల తీరుపై మండిపడుతున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement