ఉత్తరాంధ్రకు ముప్పు తప్పింది.. | Cyclone Fani Could Strike in the Path of Tens of Millions in India | Sakshi
Sakshi News home page

ఉత్తరాంధ్రకు ముప్పు తప్పింది..

May 3 2019 9:21 AM | Updated on Mar 22 2024 10:40 AM

ప్రచండ వేగంతో దూసుకొస్తున్న ఫొని తుపాను ఆంధ్రప్రదేశ్‌ను దాటడంతో ఉత‍్తరాంధ్రకు ముప్పు తప్పింది. తుపాను శ్రీకాకుళం జిల్లాను దాటినా, దాని ప్రభావం 30 కిలోమీటర్ల వరకూ ఉంటుందని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. ఫొని తుపాను ప్రస్తుతం పూరికి 40 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ ఉదయం లేదా మధ్యాహ్ననికి పూరికి సమీపంలో తుపాను తీరం దాటనుంది. ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తూ, క్రమేణా బలహీనపడి అతి తీవ్ర తుపానుగా పశ్చిమ బెంగాల్‌ వైపు పయనించనుంది. తీరం దాటే సమయంలో 170 నుంచి 200 కిలోమీటర్ల వరకూ పెనుగాలులు వీయనున్నాయి. ఇక శ్రీకాకుళం జిల్లాలో 60 నుంచి 115 కిమీ వరకూ పెనుగాలులు వీచే అవకాశం ఉంది. రాగల 24 గంటల్లో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement