ప్రత్యేక హోదాపై చంద్రబాబు పిల్లిమొగ్గలు వేశారు | CPM Walk Out The Chandrababu All Party Meeting | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదాపై చంద్రబాబు పిల్లిమొగ్గలు వేశారు

Mar 27 2018 4:35 PM | Updated on Mar 22 2024 10:49 AM

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో సచివాలయంలో మంగళవారం జరిగిన అఖిలపక్ష సమావేశంమధ్యలోనే సీపీఎం పార్టీ నేత మధు బయటకు వచ్చేశారు. అఖిలపక్షం చేసిన తీర్మానం రాష్ట్రానికి మేలు చేసేలా లేదని విమర్శించారు. రాష్ట్రం నష్టపోవడానికి కారణం తెలుగు దేశం, బీజేపీ పార్టీలే కారణమని ఆయన దుయ్యపట్టారు. ఏపీకి అన్యాయం చేసిన పాపం బీజేపీతో పాటు టీడీపీకి ఉంటుందన్నారు. ‘ దేశంలో ఏ రాష్ట్రానికీ జరగని అన్యాయం ఆంధ్రప్రదేశ్‌కు జరిగింది. పార్లమెంటులో చేసిన చట్టాన్ని కూడా అమలు చేయడం లేదని, ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు’  అని మధు పేర్కొన్నారు. అఖిలపక్ష డ్రామాతో చంద్రబాబు చేసిన పాపాన్ని అందరికి రుద్దాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement