దేవాదాయశాఖలో అవినీతి ఆజాదు | Sakshi
Sakshi News home page

దేవాదాయశాఖలో అవినీతి ఆజాదు

Published Wed, Dec 13 2017 9:37 AM

‘అధర్మా’దా యం కూడబెట్టారన్న అభియోగంపై దేవాదాయశాఖ రాజ మహేంద్రవరం రీజనల్‌ జాయిం ట్‌ కమిషనర్‌(ఆర్‌జేసీ) శీలం సూర్యచంద్రశేఖర్‌ ఆజాద్‌ ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ పంజా విసిరింది. తెలుగు రాష్ట్రాల్లోని ఆయన నివాసాలతోపాటు బంధువులు, బినామీ లకు చెందిన ఆస్తులపై 18 చోట్ల ఏసీబీ 21 బృందా లతో ఆకస్మిక సోదాలు జరిపింది. హైదరాబాద్, విజయవాడ, నూజివీడు, ఏలూరు, రాజమండ్రి, అనంతపురం తదితర ప్రాంతాల్లో సోదాలు జరిపి బ్యాంక్‌ పాస్‌ పుస్తకాలు, రికార్డులు, ఇతర డాక్యుమెంట్లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.