పిల్లలతో ఆడుకుంటోన్న సుప్రీం హీరో

చిత్రలహరి సినిమాతో సక్సెస్‌ చూసిన మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ ఆచితూచి కథలను ఎంచుకుంటున్నాడు. మునుపటిలా మాస్‌ ఫార్ములా అంటూ చూడకుండా కథకు ప్రాధాన్యమున్న చిత్రాలను సెలెక్ట్‌ చేసుకుంటోన్నట్లు కనిపిస్తోంది. 

ప్రస్తుతం ఈ హీరో ప్రతిరోజూపండుగే అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ మూవీ అని తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్‌లో ఉన్నప్పుడు.. పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉన్న వీడియోను సాయి ధరమ్‌ తేజ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. పిల్లలతో కలిసి ఆడుకోవడం ఎంతో ఆనందంగా ఉందంటూ వీడియోను పోస్ట్‌ చేశాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top