నీరవ్ మోదీ కుంభకోణం దెబ్బ నుంచి కోలుకునే క్రమంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) నిధుల సమీకరణకు పలు చర్యలు తీసుకుంటోంది. అనుబంధ సంస్థల్లో వాటాల విక్రయం, మొండి బాకీల రికవరీ తదితర మార్గాల్లో సెప్టెంబర్ ఆఖరు నాటికి రూ. 13,000 కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్లు బ్యాంకు వర్గాలు తెలిపాయి.