నగరంలో అద్దాల్లా మెరిసే రోడ్ల పొడవునా.. భూగర్భంలో పరుచుకున్న అంధకూపాలకు పాలకులు వాళ్లు. తెల్లవారడంతోనే వీరి బతుకులు మురుగులో కూరుకుపోతాయి. పొద్దెక్కే వరకూ అందులోనే మురిగిపోతాయి. ఊపిరి సలపనివ్వని దుర్గంధంలో గంటల తరబడి పని చేస్తే గానీ వారి బతుకులు ముందుకు సాగవు. సాటి మనుషులు ఇదేం పనని మలినంలా చూస్తున్నా.. పొట్టకూటి కోసం మలినంలోనే మసలుతుంటారు. అదే మనుషుల వ్యర్థాలతో పేరుకుపోయిన మ్యాన్హోల్స్ను శుభ్రం చేసి.. అందరికీ స్వస్థత చేకూరుస్తారు. మురికిలో మగ్గుతున్న ఆ కార్మికులను ‘సాక్షి’ సిటీప్లస్ తరఫున స్టార్ రిపోర్టర్గా నటుడు ఉత్తేజ్ పలకరించారు. హలో అంటూ వారితో చేయి కలిపి ఆ మనసులోని మాటలు మన ముందుంచారు.
Dec 14 2014 8:26 PM | Updated on Mar 20 2024 3:43 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement