వారెవ్వా.. రాహుల్ : భారత్ స్కోర్ 358/5 | Sakshi
Sakshi News home page

వారెవ్వా.. రాహుల్ : భారత్ స్కోర్ 358/5

Published Mon, Aug 1 2016 7:43 AM

భారత ఓపెనర్ బ్యాట్స్‌మన్ లోకేశ్ రాహుల్ (303 బంతుల్లో 158; 15 ఫోర్లు, 3 సిక్స్) రెండో టెస్టులో చెలరేగిపోయాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 125 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉంది. రహానే 42, సాహా 17 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.