క్వార్టర్‌ ఫైనల్లో సైనా, సింధు | quarterfinals Saina, Sindhu | Sakshi
Sakshi News home page

Mar 10 2017 7:05 AM | Updated on Mar 22 2024 11:05 AM

ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ రాకెట్లు సింధు, సైనా నెహ్వాల్‌ దూసుకెళ్తున్నాయి. ఇప్పటిదాకా రెండో రౌండ్‌ దాటని పూసర్ల వెంకట సింధుతో పాటు, 2015 రన్నరప్‌ సైనా క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. ఒకవేళ వీళ్లిద్దరు క్వార్టర్స్‌ అడ్డంకిని అధిగమిస్తే... సెమీఫైనల్లో ఇద్దరి మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ పోరాటం ముగిసింది. రెండో రౌండ్లో అతను 13–21, 5–21తో ఏడో సీడ్‌ తియాన్‌ హౌవే (చైనా) చేతిలో పరాజయం చవిచూశాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement