ఫైనాన్ష్ సంస్థలను భారీ హంగులతో ఏర్పాటు చేయడం.. ఆపై ప్రజలను బురిడీ కొట్టించడం గత కొంతకాలంగా పరిపాటిగా మారిపోయింది. తాజాగా ఇదే జాబితాలో సువర్ణ ఇండియా ఫైనాన్స్ సంస్థ కూడా చేరిపోయింది. ప్రజలకు లేని పోని ఆశల చూపించి దాదాపు రూ.30 కోట్లు సేకరించిన అనంతరం బోర్డు తిప్పేశారు. గుట్టుచప్పుడు కాకుండా బ్రాంచీలను మూసేసిన నిర్వాహకులు మెల్లగా మూటా ముళ్లు సర్దుకున్నారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన ఆ సంస్థలో పెట్టుబడిన పెట్టిన ప్రజలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే సంస్థ నిర్వాహకుడ్ని పోలీసులు రాజోలులో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Sep 7 2014 7:08 PM | Updated on Mar 21 2024 8:10 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement