తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నెచ్చెలి శశికళ నటరాజన్ రాజకీయ భవిష్యత్తుపై సుప్రీంకోర్టు మంగళవారం ‘తీర్పు’ ఇవ్వనుంది. తమిళనాడులో నెలకొన్న ప్రస్తుత రాజకీయ సంక్షోభాన్ని.. 20 ఏళ్ల నాటి ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఇవ్వబోయే ఈ తీర్పు మరో మలుపు తిప్పనుంది. జయలలిత 1991-96 మధ్య తమిళనాడు ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆదాయానికి మించి రూ. 66 కోట్లకు పైగా ఆస్తులు సమీకరించుకున్నారనేది అసలు కేసు. ఇందులో జయలలితతో పాటు.. ఆమె స్నేహితురాలు శశికళ, ఆమె బందువులు ఇళవరశి, వి.ఎన్.సుధాకరన్లు కూడా నిందితులుగా ఉన్నారు.
Feb 14 2017 6:39 AM | Updated on Mar 22 2024 11:07 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement