ఎస్వీయూలో విద్యార్థుల ఆందోళన | students dharna at sv university | Sakshi
Sakshi News home page

Aug 19 2015 12:27 PM | Updated on Mar 20 2024 1:06 PM

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని హాస్టళ్లలో నీటి కొరత తీవ్రంగా ఉందని, గుక్కెడు నీళ్లు లేక విద్యార్థులు ఇబ్బందిపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బుధవారం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మంగళవారం రాత్రి నీటి కొరత గురించి అధికారులకు తెలిపనా వారు పట్టించుకోకపోవడంతో బుధవారం ఉదయం విద్యార్థులు యూనివర్సిటీ పరిపాలనా భవనం ఎదుట ధర్నాచేశారు. అనంతరం చిత్తూరు-తిరుపతి ప్రధాన రహదారిపై బైఠాయించారు. దీంతో ఆ మార్గంలో రాకపోకలు స్తంభించాయి.

Advertisement
 
Advertisement
Advertisement