వరద ఉధృతితో వాగులో పడ్డ ఆర్టీసీ బస్సు | RTC BUS rolls into maddela vaagu in warangal district | Sakshi
Sakshi News home page

Sep 16 2016 9:48 AM | Updated on Mar 21 2024 9:52 AM

వరద ఉధృతితో ఆర్టీసీ బస్సు బోల్తాపడిన పడిన ఘటన నల్లబెల్లి శివారులో గురువారం చోటుచేసుకుంది. ప్రయాణికుల కథనం ప్రకారం.. ములుగు నుంచి నర్సంపేకు 30 మందితో నర్సంపేట డిపోకు చెందిన బస్సు సాయంత్రం బయలుదేరింది. నల్లబెల్లి మధ్యలవాగు వద్దకు చేరుకొగానే అప్పటికే కురిసిన భారీ వర్షంతో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. డ్రైవర్‌ అంకూస్‌ బస్సును వాగుదాటేంచే ప్రయత్నం చేస్తుండగా గుంతలోకి వెళ్లి అదుపుతప్పి పడిపోయింది. ప్రయాణికులు హాహాకారాలు చేయడంతో వాగు సమీపంలో ఉన్న వారు అక్కడికి చేరుకొని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో శనిగరం గ్రామానికి చెందిన కక్కెర్ల శ్రీధర్‌కు కాలుకు తీవ్రంగా, మరికొందరు ప్రయాణికులకు భుజం, తల, కాళ్లకు గాయాలయ్యాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement