సాక్షి, హైదరాబాద్: వచ్చే సోమవారం తెల్లవారుజామున ఆకాశంలో ఓ అరుదైన అద్భుతం జరగనుంది. ఆ రోజున భూమికి అతిదగ్గరగా చంద్రుడు రావడంతోపాటు అదే సమయంలో సంపూర్ణ చంద్రగ్రహణం ప్రజలకు కనువిందు చేయనుంది. ఇలాంటి ఘటన దాదాపు 33 ఏళ్ల క్రితం..1982లో ఒకసారి జరిగింది. మళ్లీ 2033 ఏడాది వరకూ సంభవించే వీలు లేదు. 28వ తేదీ ఉదయం గం. 5.40లకు ప్రారంభమయ్యే గ్రహణం గం.10.53కు ముగుస్తుంది. గం. 6.37 నుంచి గం.9.57ల మధ్య ఉంబ్రల్ దశ (చంద్రుడు పూర్తిగా భూమి ఛాయలోకి చేరిపోవడం) నడుస్తుంది.
Sep 25 2015 10:52 AM | Updated on Mar 21 2024 8:51 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement