ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ చట్టాన్ని ప్రయోగించే విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గినందుకు సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుకు, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తన కృతజ్ఞతా సందేశాన్ని ప్రజలకు అందించారు.