తమిళనాడు రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. తాజాగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వెంట ఉన్నది కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమేనన్న కథనాలు వస్తున్నాయి. మిగిలిన 130 మంది శశికళ వెంట ఉన్నారని చెబుతున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో శశికళ సమావేశమైనప్పుడు మొత్తం 130 మంది ఎమ్మెల్యేలు ఆమెకు మద్దతు చెప్పారని అంటున్నారు. అయితే ఇది ఎంతవరకు వాస్తవమో ఇంకా తేలాల్సి ఉంది. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం వెలుపల పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కనిపించారు. అయితే ఒకవైపు పన్నీర్ సెల్వం తనకు 50-70 మంది వరకు ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నారని, మరికొంత సమయం ఇస్తే పూర్తిస్థాయిలో మెజారిటీ నిరూపించుకుంటానని చెబుతున్నారు.
Feb 8 2017 12:44 PM | Updated on Mar 21 2024 8:58 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement