ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి బెంగళూరు బయల్దేరి వెళ్లారు. బెంగళూరులో జరిగే స్వచ్ఛ భారత్ సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. స్వచ్ఛ భారత్పై నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన ఉప సంఘానికి చంద్రబాబు చైర్మన్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో పలు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, కేంద్రమంత్రులు, అధికారులు పాల్గొంటారు.
Jun 24 2015 10:36 AM | Updated on Mar 22 2024 10:59 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement