ప్రస్తుతం రాష్ట్రంలో పాలన సాగిస్తున్న ఎడపాడి ప్రభుత్వం నాలుగేళ్లపాటూ ఉండాలని ప్రజలు కోరుకోవడం లేదు, కాబట్టి వెంటనే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి’.. ఈ వ్యాఖ్యలు చేసింది తిరుగుబాటు వర్గ నేత పన్నీర్సెల్వం కాదు. ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ అంతకంటే కాదు. ప్రముఖ సినీనటుడు కమల్హాసన్ నోటి నుంచి సోమవారం సంచలన వ్యాఖ్యలు వెలువడ్డాయి.