తమిళనాడు రాజధాని చెన్నై మహానగరంలో మైట్రో రైలు పరుగులు తీసింది. ముఖ్యమంత్రి జయలలిత వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా కోయంబేడు - ఆలందూరు మార్గంలో మెట్రో రైలును సోమవారం ప్రారంభించారు. మెట్రో రైలు ప్రారంభోత్సవ వేడుకను నిరాడంబరంగా నిర్వహించారు. సచివాలయం నుంచే జెండా ఊపారు. కోయంబేడు, ఆరుంబాక్కం, వడపళని, అశోక్నగర్, ఈక్కాడుతాంగల్, ఆలందూరు రైల్వే స్టేషన్లను సీఎం ప్రారంభించారు. తొలి రోజు పట్టాలెక్కే రైళ్లు ప్రత్యేక ఆకర్షణగా కన్పించే రీతిలో పుష్పాలతో అలకరించేందుకు రూ.28 లక్షలు కేటాయించడం గమనార్హం.
Jun 29 2015 1:37 PM | Updated on Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement