తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సీఎస్ రాంమోహన్ రావు, ఆయన కుమారుడి ఇళ్లు, ఆస్తులపై ఐటీ దాడులు నేటి ఉదయం వరకూ కొనసాగాయి. దాదాపు 25 గంటలపాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఐటీ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. మొత్తంగా 13 చోట్ల 100 మంది అధికారులు ఈ తనిఖీలలో పాల్గొన్నారు. తనిఖీలలో భాగంగా 30 లక్షల మేర కొత్త రూ.2వేల నోట్లు, 5 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో సోదాలు జరిపిన అధికారులు స్వాధీనం చేసుకున్న ల్యాప్ టాప్ లో పలు ఆస్తులకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు సమాచారం. వాటి ఆధారంగానే అక్రమాలకు పాల్పడ్డ సీఎస్ రాంమోహన్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. శశికళ సన్నిహితులైన రామ్మోహన్రావు, మంత్రి పళనిస్వామి నివాసాలపై జరిగిన దాడులు రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
Dec 22 2016 10:17 AM | Updated on Mar 21 2024 8:55 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement