మళ్లీ 'సర్జికల్' తరహా దాడులు.. పాక్ కకావికలు | Sakshi
Sakshi News home page

మళ్లీ 'సర్జికల్' తరహా దాడులు.. పాక్ కకావికలు

Published Tue, May 23 2017 3:56 PM

భారత సైన్యం మళ్లీ పాకిస్తాన్‌ మీద విరుచుకుపడింది. మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ తరహా దాడులు చేసింది. ఈనెల 20, 21 తేదీలలో జరిపిన ఈ దాడుల వివరాలను సైన్యం తాజాగా ప్రకటించింది. జమ్ము కశ్మీర్ రాష్ట్రంలోని నౌషేరా ప్రాంతం సమీపంలో ఉన్న పాకిస్తాన్ శిబిరాలపై భారత భద్రతా దళాలు ముమ్మరంగా కాల్పులు జరిపాయి. ఈ దాడిలో పాకిస్తాన్‌కు చెందిన పలు సైనిక శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాకిస్తానీ శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement