ఐసీజే వేదికగా భారత్‌–పాక్‌ ఢీ | Sakshi
Sakshi News home page

ఐసీజే వేదికగా భారత్‌–పాక్‌ ఢీ

Published Mon, May 15 2017 7:12 AM

అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) వేదికగా భారత్, పాకిస్తాన్‌లు నేడు మరోసారి తలపడుతున్నాయి. నెదర్లాండ్స్‌లోని ద హేగ్‌ నగరంలో ఉన్న ఐక్యరాజ్యసమితి ప్రధాన న్యాయ విభాగం ఐసీజేలో కుల్‌భూషన్‌ జాధవ్‌(46) కేసులో ఇరు దేశాలు వాదనల్ని వినిపించనున్నాయి.