తాను దర్శకత్వం వహించి.. తెరకెక్కించిన చారిత్రక సినిమా ‘రుద్రమదేవి’కు వినోదపన్ను రాయితీ విషయమై తాజాగా ఆ చిత్ర దర్శకుడు గుణశేఖర్ ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు. తాజాగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాకు వినోదపన్ను రాయితీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పిన గుణశేఖర్.. తన ‘రుద్రమదేవి’ సినిమాకు కూడా వినోదపన్ను రాయితీ ఇస్తామని ఏపీ ప్రభుత్వం అప్పట్లో హామీ ఇచ్చిందని, దీనిపై కొంత పురోగతి చూపి.. ఆ తర్వాత ఈ ఫైలును అర్ధంతరంగా మూసివేశారని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.