వైఎస్సార్ జిల్లా కొండాపురం మండలం చవటపల్లె గ్రామస్తుల ఆందోళన కొనసాగుతోంది. పరిహారం ఇప్పిస్తే సంతోషంగా ఇళ్లు ఖాళీ చేస్తాం.. లేని పక్షంలో నీళ్లలో మునిగినా సరే అక్కడినుంచి కదిలేది తమని స్పష్టం చేశారు. తమకు న్యాయమైన పరిహారం ఇవ్వకుంటే కదిలేది లేదంటూ వారు మంగళవారం ఉదయం నుంచి కడప-తాడిపత్రి జాతీయరహదారిపై చేపట్టిన ధర్నా.. నేడు కొనసాగుతోంది. గండికోట రిజర్వాయరులో ముంపునకు గురయ్యే ఆరు గ్రామాల్లో చవటపల్లె మొదటిది. గత రెండు నెలల నుంచి అవుకు రిజర్వాయరు నుంచి గండికోటకు నీరు వచ్చి చేరుతోంది.
Dec 28 2016 3:27 PM | Updated on Mar 20 2024 5:06 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement