రాజధాని నగరంలో నాలుగు మెట్రో రైలు కారిడార్లు (లైన్లు) నెలకొల్పడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. 108.17 కిలోమీటర్ల మీటర్ల మేర ఈ కారిడార్లు నిర్మించాలని మాస్టర్ప్లాన్లో పొందుపరిచారు. మొదటి కారిడార్తో విజయవాడకు, నాలుగో కారిడార్తో గుంటూరుకు రాజధానిని అనుసంధానించాలని మెట్రో ప్రాజెక్టుకు వ్యూహరచన చేశారు. భవిష్యత్తులో రాజధాని జనాభా అనూహ్యంగా పెరుగుతుందనే అంచనాతో అందుకనుగుణంగా రవాణా అవసరాలను తీర్చడం కోసం ఈ కారిడార్లను ప్రతిపాదించారు. రాజధాని నగరంలోని ఆర్టీరియల్, సబ్ ఆర్టీరియల్ రహదారులపై ఎలివేటెడ్ పద్ధతిలో ఈ కారిడార్లను నిర్మిస్తారు. రెండు దశల్లో ఈ మెట్రో ప్రాజెక్టును రాజధానిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
Jan 7 2016 7:42 AM | Updated on Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement