కేరళ సీఎం పినరయి విజయన్ బీజేపీకి ఎంత బురద అంటించాలని చూస్తే.. కమలం అంత బాగా గుబాళిస్తుందని గుర్తుంచుకోవాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ప్రపంచంలో కమ్యూనిస్టులకు ఏగతి పట్టిందో.. భారత్లోనూ వారికి అదే గతి పడుతుందని కేరళ సీఎంనుద్దేశించి వ్యాఖ్యానించారు. కేరళలో పాగే వేసేందుకు వ్యూహాలు రచిస్తున్న బీజేపీ అందులో భాగంగా జనరక్షయాత్రకు శ్రీకారం చుట్టింది. నేడు కేరళలో పర్యటిస్తున్న అమిత్ షా పయ్యన్నూర్లో జెండా ఊపి జనరక్షయాత్ర ప్రారంభించారు. కమ్యూనిస్టుల అహింసకు అడ్డుకట్ట వేసేందుకు ఈ యాత్ర చేపట్టామన్నారు.
Oct 3 2017 5:11 PM | Updated on Mar 21 2024 5:16 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement