శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకం రాష్ట్రానికి జీవధార అని.. దీనితో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. ఆగమేఘాలపై ఈ పథకం పనులు పూర్తిచేస్తామని... వచ్చే ఏడాది ఆగస్టు నాటికి కాళేశ్వరం నీటితో శ్రీరాంసాగర్ను నింపుతామని చెప్పారు.