చెక్బౌన్సు కేసులో సినీనటి, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి జీవితకు రెండు నెలల జైలుశిక్ష పడింది. రూ. 25 లక్షల జరిమానా కూడా విధించారు. 2007లో ఎవడైతే నాకేంటి అనే సినిమా నిర్మించారు. సామ శేఖర్రెడ్డి వద్ద రుణం తీసుకున్నారు. సినిమా రైట్స్ కూడా ఇస్తామని చెప్పారు. అయితే, ఏడేళ్లయినా తనకు డబ్బులు ఇవ్వలేదని, అనేకసార్లు ఆమె ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని శేఖర్ రెడ్డి చెప్పారు. ఇన్నాళ్లు వేచి చూసినా ఫలితం లేకపోవడంతో చివరకు 2014 జనవరిలో ఎర్రమంజిల్ కోర్టులో తాను చెక్ బౌన్స్ కేసు దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. కేసు విచారించిన ఎర్రమంజిల్ కోర్టు జీవితకు రూ. 25 లక్షల జరిమానా, రెండు నెలల జైలుశిక్ష విధించింది.
Nov 24 2014 3:17 PM | Updated on Mar 21 2024 11:25 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement