-
ఎర్రంమంజిల్ జిగేల్
సాక్షి, హైదరాబాద్: అంతర్థానం కాబోతున్న వేళ అది సర్కారుకు ఆర్జన తెచ్చి పెడుతోంది. సినిమా షూటింగ్ల కోసం ముస్తాబైంది. సరికొత్త అందాలతో కనువిందు చేస్తోంది. ఇంకెంతకాలం నిలిచి ఉంటుందో తెలియని డోలాయమానంలో ఉన్న ఎర్రంమంజిల్ ప్యాలెస్ ఒక్కసారిగా జిగేల్మంటోంది. కొత్త రంగులద్దుకుని చమక్చమక్మంటోంది. నగరంలో గతించిన చరిత్రకు సజీవ సాక్ష్యం అది. నగరంలో ఉన్న పెద్ద ప్యాలెస్లలో ఒకటి. దాని నిర్మాణకౌశలం అబ్బురం. భవనం ఎలివేషన్లో చెక్కిన నగిషీలు నాటి నిర్మాణ ప్రత్యేకతను చాటిచెబుతున్నాయి. ఇంత పరిజ్ఞానం అందిపుచ్చుకున్న ఈ కాలంలో కూడా అలాంటి నిర్మాణం చేపట్టడం క్లిష్టతరమని ఆర్కిటెక్ట్లు అంటారు. అక్కడే తెలంగాణ ప్రభుత్వం చట్టసభలకు కొత్త భవన సముదాయాన్ని నిర్మించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ శంకుస్థాపన కూడా చేశారు. ఆ తర్వాత కోర్టు కేసు నేపథ్యంలో దాని తొలగింపునకు విరామం ఏర్పడింది. ఆ నిర్మాణానికి క్లియరెన్స్ వస్తే ప్యాలెస్ ఉన్న స్థానంలో కొత్త అసెంబ్లీ భవన సముదాయం రూపుదిద్దుకునే అవకాశం ఉంది. ఇప్పటికే భవనం పూర్తిగా ఖాళీ చేయటంతో రోజువారీ నిర్వహణ పనులు లేక భూత్బంగ్లాగా కనిపిస్తోంది. ఈ తరుణంలో గత నాలుగైదు రోజులుగా ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచి, చెత్తాచెదారం తొలగించి రంగులేయటం మొదలుపెట్టారు. ప్యాలెస్ వెనకవైపు.. రోడ్లు, భవనాల శాఖ ప్రధాన కార్యాలయ భవనం ఉన్న వైపు రంగులేయటం పూర్తయింది. చదవండి: (కరోనా మహమ్మారి కనుమరుగైనట్లేనా?) గతంలో ప్రభుత్వ కార్యాలయ భవనాలకు వేసే సంప్రదాయ ముదురు పసుపురంగు వేశారు. ఆ భవనాన్ని తిరిగి సంరక్షించేందుకు ప్రభుత్వ విభాగం చర్యలు తీసుకుందేమోనని అక్కడికి వచ్చే వారికి సందేహం కలిగింది. కానీ, దానిని సినిమా షూటింగ్ కోసం తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న భవనాన్ని అధికారులు సినిమా షూటింగులకు అద్దెకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ యువ కథానాయకుడు హీరోగా నటిస్తున్న హిందీ సినిమా రీమేక్ కోసం సినిమా యూనిట్ దాన్ని అద్దెకు తీసుకుంది. కథానుసారం, గోవాలో ఉన్న ప్రాంతంగా ఆ భవనాన్ని చూపబోతున్నారు. ఇందుకోసం గోవా నేపథ్యంలో ప్రతిబింబించేలా అక్కడ ఏర్పాట్లు చేశారు. హిందీలో రాసి ఉన్న బోర్డులను ఏర్పాటు చేశారు. చవకే.. సినిమా షూటింగ్ కోసం ఒకరోజు అద్దెగా రూ.10 వేలు వసూలు చేస్తున్నట్టు సమాచారం. అతి తక్కువ ఖర్చులో అంత కళాత్మక భవనం సమకూరుతుండటంతో సినిమా యూనిట్లు ఆ భవనంలో షూటింగ్లు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది. పాతబడ్డప్పటికీ ఇప్పటికీ ఆ భవనంలో పటుత్వం, ఎలివేషన్ కళాత్మకంగా ఉన్నాయి. లోపలివైపు గంభీరమైన ఆర్కిటెక్చర్తో అది షూటింగ్లకు ఆహ్వానం పలుకుతోంది. త్వరలో మరికొన్ని సినిమా షూటింగ్లు కూడా అక్కడ నిర్వహించనున్నట్టు సమాచారం. అంతర్థానమయ్యేందుకు సిద్ధమై కూడా ఆ భవనం ఎంతోకొంత ఆర్జించి పెడుతుండటం విశేషం. -
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో భారీ షాక్
-
తెలంగాణ ప్రభుత్వానికి భారీ షాక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊహించని షాక్ తగిలింది. ఎర్రమంజిల్లోని పురాతన భవనాలను కూల్చి నూతన అసెంబ్లీని నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టిపారేసింది. ఎర్రమంజిల్లోని చారిత్రాత్మక భవనాలను కూల్చి ఆ స్థానంలో కొత్త భవనాలకు తెలంగాణ ప్రభుత్వం భూపూజ కూడా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంత్రివర్గం కూడా ఏకగ్రీవం తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో ఎర్రమంజిల్ భవనాలను కూల్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటినీ కలిపి ఉమ్మడిగా విచారించిన ధర్మాససం సుధీర్ఘ వాదనల అనంతరం సోమవారం తన తీర్పును వెలువరించింది. పురాతన భవనాల కూల్చివేతను తప్పుపడుతూ.. వాటిని కూల్చివేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా ఎర్రమంజిల్ భవనాల కూల్చివేతపై జూలై 3 నుంచి హైకోర్టులో పలు దఫాలుగా వాదనలు సాగుతోన్న విషయం తెలిసిందే. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ.. భవనాలను కూల్చివేసి వాటి స్థానంలో కొత్తవాటిని నిర్మించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్త భవనం నిర్మిస్తే ట్రాఫిక్ సమస్యతో తలెత్తడంతోపాటు పురాతన కట్టడాలను పరిరక్షించాల్సిన ప్రభుత్వ బాధ్యతను విస్మరించినట్టు అవుతుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వీరి వాదనతో ఏకీభవించిన ధర్మాసనం ప్రభుత్వ నిర్ణయాన్ని తొసిపుచ్చింది. ఇదిలావుండగా.. తాజా హైకోర్టు తీర్పుతో ప్రభుత్వ తదుపరి నిర్ణయంపై ఆసక్తినెలకొంది. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందింస్తో వేచి చూడాలి. -
ఎర్రమంజిల్ భవనం కూల్చివేతపై స్టే ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చరాదంటూ దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఎర్రగడ్డలోని ‘ఇరానుమా’ కూల్చివేత ప్రయత్నాలను అడ్డుకున్నట్లుగానే ఎర్రమంజిల్ భవనం కూల్చివేత విషయంలోనూ స్టే ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయ వాది నళిన్ కుమార్ కోరారు. రెగ్యులేషన్ 13ప్రకారం హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్లో చేర్చారని, దీని ద్వారానే హెరిటేజ్ కన్జర్వేటివ్ కమిటీ ఏర్పడిందన్నారు. వారసత్వ జాబితాలో భవనాల్ని చేర్చినా, తిరిగి ఆ జాబితా నుంచి ఏదైనా భవనాన్ని తొలగించాలన్నా ఆ చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం చేయాలన్నారు. మరమ్మతులు చేయాలన్నా కమిటీ అనుమతి అవసరమని, ఏ అనుమతి లేకుండా ఎర్రమంజిల్ భవన ప్రదేశంలో చట్టసభల భవన సముదాయాన్ని నిర్మించాలని నిర్ణయించడం చట్టవ్యతిరేకమన్నారు. ఇరానుమా భవనం కూల్చివేయరాదన్న కేసులో హైకోర్టు.. హెరిటేజ్ కన్జర్వేటివ్ కమిటీ ఏర్పాటు చేయాలని 2015లో ఇచ్చిన ఆదేశాల్ని ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ధర్మాసనం కల్పించుకుని.. దీన్ని లోతుగా విచారించాల్సి ఉందంది. గత విచారణ సమయంలో హెచ్ఎండీఏ చట్టంలోని రెగ్యులేష న్ 13ను తొలగించినప్పటికీ జోనల్ రెగ్యులేషన్లో ఉన్నందున మాస్టర్ ప్లాన్లో అది కొనసాగుతుందని వాదించారని తెలిపింది. ఇప్పుడు జోనల్ రెగ్యులేషన్కు స్వయంప్రతిపత్తి ఉందని, హెచ్ఎండీఏ చట్టంలోని 13వ నిబంధన తొలగింపు ప్రభావం లేదని అందుకు విరుద్ధంగా ఎలా చెబుతున్నారో వివరణ ఇవ్వాలంది. హెచ్ఎండీఏ చట్టాన్ని రూపొందించినప్పుడు 13వ నిబంధన లేదని, తర్వాత చేర్చిన ప్రభుత్వం తిరిగి 2015లో తొలగించిందని, కొత్త చట్టంలో 13వ నిబంధన ఏ విధంగా ఉనికిలో ఉంటుందో చెప్పాలని, పిటిషనర్లను కోరుతూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. -
మాస్టర్ ప్లాన్ నివేదించండి
సాక్షి, హైదరాబాద్: ఎర్రమంజిల్ భవన కూల్చివేతను అడ్డుకోవాలని కోరుతున్న కేసులో హెచ్ఎం డీఏ మాస్టర్ ప్లాన్ను హైకోర్టుకు నివేదించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ల ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎర్రమంజిల్ భవన ప్రదేశంలో చట్టసభల సముదాయాన్ని నిర్మించాలనే ప్రయత్నాల్ని అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను శుక్రవారం హైకోర్టు విచారణ చేసింది. ధర్మాసనం ఆదేశాల మేరకు రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి స్వయంగా విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా హుడా చట్టంలోని 13వ నిబంధనను రద్దు చేశామని ప్రభుత్వం చెబుతున్నా ఆ నిబంధనను హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్లో పొందుపర్చారని ధర్మాసనానికి న్యాయవాది నివేదించారు. కొత్త అసెంబ్లీ భవన సముదాయాల నిర్మాణానికి 20 నుంచి 25 ఎకరాల భూమి అవసరమని «గణపతిరెడ్డి ధర్మాసనానికి తెలిపారు. కొత్త అసెంబ్లీ భవనాల కోసం ప్రణాళిక ఇంకా సిద్ధం కాలేదన్నారు. ప్రణాళిక బాధ్యతలను ప్రభుత్వం మూడు కన్సల్టెన్సీ సంస్థలకు ఇచ్చిందని, ఆ సంస్థల నుంచి మూడు ప్రణాళికలు వచ్చాక అందులో ఒక దానిని ప్రభుత్వం ఆమోదిస్తుందన్నారు. దీంతో ధర్మా సనం జోక్యం చేసుకుని గదులు, సమావేశ మందిరాలు ఎన్నెన్ని ఉంటాయి వంటి వివరాలు ఇవ్వాల ని కోరింది. ఇవి కన్సల్టెన్సీల నుంచి ప్రణాళికలు వచ్చాకే అవి తెలుస్తాయని గణపతిరెడ్డి సమాధానమిచ్చారు. ఇప్పుడున్న అసెంబ్లీ, కౌన్సిల్ వేర్వేరుగా ఉన్నాయని, ఇవి సుమారు 25 ఎకరాల్లో ఉన్నాయని, ఇప్పుడు కూడా అదే భూమి అవసరం అవు తుందని తెలిపారు. ప్రభుత్వం నిబంధన 13 ను రద్దు చేసిందని, ఈ పరిస్థితుల్లో ఆ నిబంధన ప్రారంభమైనప్పటి నుంచి అమల్లో లేనట్లేనని చెబుతోందని, దీనిపై ఏం చెబుతారని పిటిషనర్ను ధర్మాసనం ప్రశ్నించింది. విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. ఆమె ఆమ్మగారు ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!
2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!
వరల్డ్కప్ ట్రోఫీతో ఫోజులిచ్చిన యువరాజ్.. ఫోటోలు వైరల్
ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?: సీఎం జగన్
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement