పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో దారిద్ర రేఖ (బీపీఎల్)కు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన ప్రతి మహిళ ఖాతాలోనూ రూ. 25వేలు డిపాజిట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ డిమాండ్ చేశారు. నోట్ల రద్దుతో నిరుపేద కుటుంబాలే ఎక్కువగా కష్టాలు ఎదుర్కొన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ 131వ స్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన బుధవారం మాట్లాడారు. నోట్ల రద్దుకు రెండునెలల ముందే రూ. 25లక్షలకు మించి డిపాజిట్ అయిన బ్యాంకు ఖాతాల వివరాలన్నింటినీ వెల్లడించాలని ప్రధాని మోదీకి అల్టిమేటం జారీచేశారు. నోట్లరద్దు కష్టాలపై ప్రధాని మోదీ చెప్పిన 50రోజుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఆయన ముందు రాహుల్ పలు డిమాండ్లు పెట్టారు.
Dec 28 2016 12:18 PM | Updated on Mar 21 2024 9:02 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement