ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుంటిసాకులు చెబుతున్నాయని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదాపై పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని తుంగలో తొక్కి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా ఆవశ్యకతపై గురువారం ఏలూరులోని శ్రీ కన్వెన్షన్ హాలులో జరిగిన యువభేరిలో ఆయన ప్రసంగించారు.