ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు ప్రభుత్వం గ్రాంటు విడుదల చేయాలి. లైబ్రరీ సెస్సు ఎప్పటికప్పుడు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి. నిరుద్యోగులు, విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచడంతోపాటు గ్రంథాలయాలను ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచాలి. నిధులు మంజూరు చేయకుండా లైబ్రరీల్లో సమ్మర్ క్యాంపులు నిర్వహించాలని జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలి. – నాదెండ్ల బాబ్జి,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం, కడప


