తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్డేట్స్..
ఆర్టీసీ కార్మికులకు మంత్రి సీతక్క విజ్ఞప్తి
- ఆర్టీసీ సోదరులు సమ్మె విరమించాలి
- ఆర్టీసీ మనందరి కుటుంబం…కార్మికులు మా సోదరులు..
- సమ్మె విరమించి విధుల్లో చేరాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా
- సమ్మె సమస్యకు పరిష్కారం కాదు… ప్రభుత్వం చర్చల ద్వారా పరిష్కారం కోరుతోంది.
- మీ సమస్యలపై ఇప్పటికే ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేశాం… 4 వారాల్లో నివేదిక వస్తుంది.
- మీరు లేవనెత్తిన విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలు వంటి అంశాలు సాంకేతికంగా పరిశీలనలో ఉన్నాయి
- ఈ రెండు కీలక విషయాల్లో ఆర్టీసీ కార్మిక సంఘాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించే పనిలో ఉన్నాం
ఆర్టీసీని కాపాడుకుంది కాంగ్రెస్ పార్టీ: అద్దంకి
- ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ కామెంట్స్..
- ఆర్టీసీ కార్మికులను నష్టపరచాలని ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయి
- కుట్రదారులను కార్మికులు నమ్మవద్దు
- ఆర్టీసీని కాపాడుకుంది కాంగ్రెస్ పార్టీ
- ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలని కేసీఆర్ అండ్ కో భావించింది
- కేసీఆర్ కోసం కొందరు చేసే సమ్మెకు కార్మికులు సహకరించవద్దు
- ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్, మంత్రి పొన్నం అండగా ఉంటారు
చర్చలకు సిద్దం: మంత్రి పొన్నం
- ఆర్టీసీ జేఏసీతో చర్చలకు సిద్దం.
- సమ్మె విరమించి చర్చలకు రండి.
- 32 సమస్యల్లో 29 అంశాలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాం.
- కమిటీ వేశాం.. నాలుగు వారాల సమయం అడిగాం.
- 2018లో ఈవీ బస్సులు మొదలయ్యాయి.
- ఈవీ బస్సులు కేంద్రం నిర్ణయం
- ఈవీ బస్సుల కారణంగా ఒక్క ఉద్యోగిని కూడా తొలగించం.
- గత ప్రభుత్వ చర్యలు గుర్తులేదా?.
- హరీష్ రావు వెనుక ఉండి సమ్మెను నడిపిస్తున్నారు.
- ఆర్టీసీని నిర్వీర్యం చేసుకోవద్దు.
నిర్మానుష్యంగా ఎంజీబీఎస్
- ఆర్టీసీ కార్మికుల సమ్మెతో వెలవెలబోతున్న బస్టాండ్
- బస్సులు లేకపోవడంతో ఖాళీగా ఎంజీబీఎస్.

హైదరాబాద్..
- ప్రతీ రోజు 6779 బస్సులు నడుపుతున్న ఆర్టీసీ.
- సమ్మె కారణంగా 1247 బస్సు లు నడుపుతున్న ఆర్టీసీ..
- సాయంత్రం వరకు మరికొన్ని బస్సుల సర్వీసులు పెంచుతామంటుంన్న ఆర్టీసీ.
- ఈరోజు 9 గంటల వరకు కేవలం 18% బస్సులు మాత్రమే నడిపిన ఆర్టీసీ..
- ఇందులో 634 ప్రైవేట్ బస్సులు నడుపుతున్నారు..
- ఎలక్ట్రిక్ బస్సులు 467 నడుపుతున్నారు...
- మొత్తం 4 శాతం బస్సులను నడుపుతున్న ఆర్టీసీ..
- పోలీసుల భద్రత మధ్య డిపోల నుంచి బస్సులు ముందుకు సాగుతున్నాయి.

ఆర్టీసీ సమ్మెతో ప్రభుత్వం అలర్ట్..
- ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.
- 12 గంటలకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలతో మంత్రి పొన్నం ప్రభాకర్ జూమ్ మీటింగ్..
- ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో చొరవ తీసుకోవాలని మంత్రి పొన్నం సూచించనున్నట్టు సమాచారం.
నల్లొండలో నిలిచిపోయిన 350 బస్సు సర్వీసులు
- ఉమ్మడి నల్లొండ జిల్లాలో నిలిచిపోయిన 350 బస్సు సర్వీసులు
- ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె పాక్షికంగా సాగుతోంది.
- ఉమ్మడి నల్గొండలో 180కి పైగా ఎలక్ట్రిక్, ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి.
- ఉమ్మడి నల్గొండ జిల్లాలో 7 డిపోల్లో 350కి పైగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఆర్టీసీ బంద్ సంపూర్ణం
- కార్మికుల సమ్మెతో నాగర్ కర్నూల్ జిల్లాలో ఆర్టీసీ డిపో మూతపడింది.
- బస్సులు లేకపోవడంతో ప్రయాణికుల రాకపోకలు స్తంభించిపోయాయి.
- బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ప్రైవేటు వాహనాలను ప్రయాణికులు ఆశ్రయిస్తున్నారు.
- పోలీసుల పహారా మధ్య ఇప్పటివరకు మూడు ప్రైవేటు బస్సులను డిపో నుంచి బయటకు తీశారు.
ఆర్టీసీ బస్సు-లారీ ఢీ..
- కరీంనగర్లోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఢీకొన్న ఆర్టీసీ బస్సు-లారీ
- ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.
- దీంతో వారిని స్థానికుల సహాయంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
- కరీంనగర్ నుంచి వరంగల్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్..
- ఆర్టీసీ సోదరులకు నా కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి
- ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ప్రజా శ్రేయస్సు దృశ్య సమ్మె విరమించాలని విజ్ఞప్తి
- సమ్మె సమస్యకు పరిష్కారం కాదు..
- ప్రభుత్వం ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం గల నలుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది..
- నాలుగు వారాల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించాం..
- కమిటీల పేరుతో కాలయాపన చేస్తామనడం పొరపాటు..
- ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలకు ప్రభుత్వం నుండి ఎలాంటి వ్యతిరేకత లేదు..
- అన్ని వెంటనే పరిష్కారం అయ్యే అంశాలు..
- ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలు రెండు పెండింగ్లో ఉన్నాయి..
- ఈ రెండు అంశాల్లో పలు సాంకేతిక అంశాలు చరించాల్సి ఉంది.
- వారు అధ్యయనం చేయడానికి నాలుగు వారాల గడువు అడిగాం..
- ఈ రెండు అంశాలు ముఖ్యమంత్రి దగ్గర, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చిస్తామని నలుగురు అధికారుల కమిటీకి తెలియజేశాం..
- ఆర్టీసీ విలీనం ఆలస్యం అయిన ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు వస్తున్నాయి..
- గుర్తింపు సంఘాల ఎన్నికల విషయంలో నాయకుల మధ్య అంతర్యుద్ధం నాయకత్వ అంశాలు ఉన్నాయి
- ప్రభుత్వం ఏర్పడగానే గతంలో పెండింగ్ లో ఉన్న 2017 పీఆర్సీ క్లియర్ చేశాం..
- పెండింగ్ డీఏలు లేకుండా క్లియర్ చేశాం..
- 2013 పెండింగ్ బాండ్స్ క్లియర్ చేశాం
- రూ.1205 కోట్లు ఉన్న పీఎఫ్ బకాయిలను రూ.600 కోట్లకు తగ్గించాం
- రూ.690 కోట్లు ఉన్న సీసీఎస్ బకాయిలను రూ.300 కోట్లకు తగ్గించాం
- ఇవే కాకుండా నెల వారిగా పీఎఫ్, సీసీఎస్కి 75 కోట్లు చెల్లిస్తున్నాం..
- ఉద్యోగులపై పని భారం పడకుండా ఉండడానికి 4538 ఉద్యోగాల నియామకాలు భర్తీ త్వరలోనే పూర్తవుతుంది..
- సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న 1134 కారుణ్య నియామకాలు చేపట్టాం..
- గత ప్రభుత్వం లో వివిధ కారణాలతో శాశ్వతంగా సర్వీసు నుండి రిమూవ్ అయిన వారిలో ఇప్పటి వరకు దాదాపు 250 మందికి తిరిగి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది..
- అన్ని అంశాలు పరిష్కారం చేస్తాం..
- ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది..
- మూలిగే నక్క పై తాటి పండు పడ్డట్టు వద్దు..
- గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా ఆర్టీసీ లో ఏం జరిగిందో కార్మికులందరికీ తెలుసు
- ఆర్టీసీలో ప్రయాణించింది పేదలు గ్రామీణ ప్రాంత ప్రజలు, మన అక్కా చెల్లెల్లు ..
- ప్రతి రోజు 65 లక్షల మంది ప్రయాణం చేస్తుంటే అందులో 45 లక్షల మంది మహిళలే ఉన్నారు..
- ఆర్టీసీలో నిత్యం ఉపాధి కోసం విద్య, వైద్యం కోసం పోయే పరిస్థితి..
- ప్రభుత్వం పక్షాన మరోసారి విజ్ఞప్తి చేస్తున్న.. సమ్మె వద్దు..
- మిమ్మల్ని ఎవరు అడ్డుకోరు ప్రజాస్వామ్య పద్ధతిలో మీ నాయకులు నిరసన తెలుసుకోవచ్చు..
- ప్రభుత్వం పై ఒత్తిడి తేవచ్చు
- పేద ప్రజల ప్రయాణాలకు ఇబ్బందులు కలగజేయవద్దు..
- పేద ప్రజలకు కార్లలో పోయే స్థోమత లేదు..
- ప్రతి ఒక్క ఆర్టీసీ కుటుంబ సభ్యుడికి కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్న..
- ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం తరుపున కొట్లాడి సాధించుకుందాం..
- ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది..
- మీ సమస్యల పరిష్కారం పై సానుకూలంగా ఉన్నాం..
- సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దు..
- నేను విద్యార్థి నాయకుడిని.. కార్మికులకు అండగా ఉంటా..
- గ్రామీణ ప్రాంతాల ప్రజలకు లైఫ్ లైన్ అయిన ఆర్టీసీ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి..
- మీ నాయకులు నిరసనలు చెప్పుకొని వారికి ఆ హక్కు ఉంది..
- మిగతా వారంతా విధుల్లో చేరి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేయాలని విజ్ఞప్తి చేస్తున్న..
కామారెడ్డిలో ఉద్రికత్త..
- కామారెడ్డి ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత
- అద్దె బస్సులను అడ్డుకున్న జేఏసీ నేతలు..
- జేఏసీ నేతలు, పోలీసులకు మధ్య తోపులాట
- ఆర్టీసీ కార్మికులను అరెస్టు చేసిన పోలీసులు...
- ధర్నాకు దిగిన ఆర్టీసీ కార్మికులు..
సూర్యాపేట జిల్లా
- కోదాడ బస్ డిపోలో తీవ్ర ఉద్రిక్తత
- బస్సులను బలవంతంగా డిపో నుంచి పోలీస్ పహారాలో తీసుకొస్తుండగా అడ్డుకున్న సమ్మెలో ఉన్న ఉద్యోగులు
- బస్సు కింద పడుకుని డైవర్ల నిరసన
- బలవంతంగా లాగి పక్కకు పడేసిన పోలీసులు
అద్దె బస్ డ్రైవర్లు Vs పోలీసులు
- మంచిర్యాల జిల్లా
- తమపై పోలీసులు దాడి చేశారంటూ అద్దె బస్ డ్రైవర్ల ఆందోళన
- మంచిర్యాల బస్ డిపో ఎదుట నిరసన వ్యక్తం చేసిన అద్దె బస్ డ్రైవర్లు
- కండక్టర్లను ఇవ్వకుండా బస్సులను తీసేదే లేదంటున్న అద్దె బస్ డ్రైవర్లు
- ప్రజలు ఆగ్రహంతో బస్సులపై దాడులు చేస్తే ఎవరు భద్రత కల్పిస్తారని ఆగ్రహం
- యజమానుల హామీతో నిరసన విరమించిన డ్రైవర్లు
డివైడర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..
- కరీంనగర్ బైపాస్లో ఆర్టీసీ బస్సు డివైడర్ను ఢీకొట్టింది.
- ప్రైవేటు డ్రైవర్ బస్సు నడపడంతో ప్రమాదం
- తృటిలో తప్పిన పెను ప్రమాదం, ప్రయాణికులకు గాయాలు.
- గాయపడిన వారికి ఆసుపత్రికి తరలింపు..

కామారెడ్డి బస్టాండ్లో ఉద్రిక్తత
- కామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్లో ఉద్రిక్తత నెలకొంది.
- నిజాంసాగర్ వెళ్లే బస్సును బయటకు తీసుకువచ్చే ప్రయత్నం.
- పోలీస్ బందోబస్తు మధ్య బస్సు కదిలింపు
- బస్సును అడ్డుకున్న జేఏసీ నాయకులు.
- ప్రైవేటు డ్రైవర్ సాయి రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జేఏసీ నాయకులు.
- బస్టాండ్లో కొంత సేపు ఉద్రిక్తత
- సమ్మె వల్ల బాన్సువాడ ఆర్టీసి డిపోలో ఆగి పోయిన బస్సులు.
- పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు బస్సులు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు.
- అధిక డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్ వాహన దారులు.
సంగారెడ్డిలో ఉద్రిక్తత..
- సంగారెడ్డి ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత..
- అద్దె బస్సులను పటాన్చెరు పంపేందుకు అధికారుల యత్నం.
- బస్సులను అడ్డుకున్న కార్మికులు.
- కార్మికులను చెదరగొట్టిన పోలీసులు.
- పోలీసు ఎస్కార్ట్ వాహనంతో బస్సులను నడుపుతున్న అధికారులు.
మెదక్ జిల్లా..
- మెదక్ ఆర్టీసీ డిపోలో పోలీసులకు, ఆర్టీసీ కార్మికుల మధ్య వాగ్వివాదం..
- బస్సులను డిపోల నుండి బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్న కార్మికులు..
ప్రయాణికుల అవస్థలు..
- ఆర్టీసీ సిబ్బంది సమ్మెతో అవస్థలు పడుతున్న ప్రయాణికులు
- ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు కొన్ని డిపోల్లో ఆర్టీసీ అద్దె బస్సులను నడిపిస్తున్నారు.
- సమ్మె నేపథ్యంలో డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితమయ్యాయి.
- పికెట్, కంటోన్మెంట్, రాణిగంజ్ డిపోలలో బస్సులు నిలిచిపోయాయి.
- దీంతో ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
చర్లపల్లిలో ప్రయాణికుల ఇక్కట్లు
- ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో చర్లపల్లి రైల్వేస్టేషన్లో ప్రయాణికుల ఇక్కట్లు
- చర్లపల్లి రైల్వే స్టేషన్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- ఇదే అదనుగా ఆటో డ్రైవర్లు రేట్లు పెంచడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు రాపిడో, ఓలా, ఉబర్ను ఆశ్రయిస్తున్నారు.
గోదావరిఖనిలో బందోబస్తు..
- పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు సమ్మె చేపట్టారు.
- దీంతో బస్సులు డిపోలకే 150 బస్సులు, 600 ఉద్యోగులు పరిమితం అయ్యారు.
- గోదావరిఖని బస్టాండ్, డిపో వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
కార్మికులు విధులకు హాజరు కావాలి: ఆర్టీసీ ఎండీ
- కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది: ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
- సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నాలుగు వారాల గడువు కోరింది.
- దశల వారీగా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది.
- కార్మికులు విధులకు హాజరు కావాలి.
నోటీసు నుంచి సమ్మె వరకు
- ఆర్టీసీ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) మార్చి 13, 2026న సమ్మె నోటీసు
- ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మె
- రాత్రి వరకు ప్రభుత్వం నియమించిన ముగ్గురు ఉన్నతాధికారుల కమిటీతో కార్మిక సంఘాల నేతలు చర్చలు
- సమస్యల పరిష్కారానికి 4 వారాల సమయం కావాలని కోరిన అధికారులు
- ఇవి పాత డిమాండ్లేనని, ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపిస్తూ చర్చల నుంచి తప్పుకున్న కార్మిక సంఘాలు
- మొత్తం 32 డిమాండ్లతో చర్చలు
- ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్
- పెండింగ్లో ఉన్న 30% ఫిట్మెంట్ మరియు వేతన బకాయిల చెల్లింపు చేయాలని కోరిన కార్మిక సంఘాలు
- పీఎఫ్ (PF), సీసీఎస్ (CCS) కు సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్
- కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడం
- ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫేస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పట్టుపడుతున్న కార్మిక సంఘాలు
- మొత్తం RTC బస్సులు 9,375
- ఆర్టీసీ స్వంత బస్సులు: 6,594
- అద్దె (Hire) బస్సులు: 3,396
- సమ్మె కారణంగా దాదాపు 6,000 పైగా బస్సులు డిపోలకే పరిమితం
- సుమారు 50,000 మందికి పైగా సిబ్బంది ఉండగా, సమ్మెలో దిగిన మెజారిటీ కార్మికులు
- ఆర్టీసీ రోజువారీ ఆదాయం సుమారు రూ. 21 కోట్లు
- రోజూ ప్రయాణించే 60 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బంది
- గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి కార్మిక సంఘాలు ముందుగానే నోటీసు ఇవ్వడం, ప్రభుత్వ హామీలపై స్పష్టత కోరడం అనే వ్యూహంతో అడుగులు
- కేవలం కమిటీలతో కాలయాపన చేయకుండా, జీవో (GO) రూపంలో లేదా లిఖితపూర్వక హామీ వచ్చే వరకు సమ్మె విరమించకూడదని నిర్ణయం
- రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్ద నిరసనలు తెలుపుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయం

ఆర్టీసీ బస్సులు బంద్
చర్చలు విఫలం.. నేడు తొలి షిఫ్ట్ నుంచి ఆర్టీసీ బస్సులు బంద్
సమ్మె నోటీసు ఇచ్చిన జేఏసీకి మద్దతు ప్రకటించిన రెండో జేఏసీ
భారీగా తాత్కాలిక సిబ్బందిని సమకూర్చుకుంటున్న ఆర్టీసీ
యథావిధిగా తిరగనున్న ఎలక్ట్రిక్ బస్సులు సహా ఆర్టీసీలోని అద్దె బస్సులు
తాత్కాలిక సిబ్బందితో మరో 2 వేల బస్సులు తిప్పే యత్నం
సగానికిపైగా బస్సులు రోడ్డెక్కేలా ఆర్టీసీ యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు..
బస్సులు తిరగకుండా అడ్డుకునే ప్రయత్నంలో సంస్థ కండక్టర్లు, డ్రైవర్లు
ప్రభుత్వ ఆదేశాలు..
- జిల్లాలవారీగా ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేయాలని ఆర్డీవోలకు ప్రభుత్వం ఆదేశం.
- జీహెచ్ఎంసీ పరిధిలో వీలైనన్ని ఎక్కువ ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంచాలని ఆదేశం.
- ఎక్కడికక్కడే బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులకు తిప్పలు.
- సగానికిపైగా బస్సులు రోడ్డెక్కేలా ప్రభుత్వం చర్యలు.
జేబీఎస్లో బస్సులు బంద్..
- సమ్మె బాటలో ఆర్టీసీ ఉద్యోగులు
- జేబీఎస్లో సమ్మె ప్రభావం
- తాత్కాలిక ఉద్యోగులతో బస్సులు నడిపే ప్రయత్నం
- భారీగా పోలీసుల మోహరింపు
- ప్రశాంతంగా ధర్నా చేసుకోవాలని పోలీసుల సూచనా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
- రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె భాగంగా కొత్తగూడెంలో ఆర్టీసీ డిపోలో నిలిచిపోయిన 66 బస్సులు.
- స్వచ్ఛందంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు.
- కొత్తగూడెం ఆర్టీసీ డిపో ఎదుట సీపీఐ, ఆర్టీసీ నాయకులు ధర్నా.
- ధర్నా చేస్తున్న ఆర్టీసీ, సీపీఐ నాయకులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించిన పోలీసులు.
- బస్సులు లేక బస్టాండ్లో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు.
- ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల భారీ బందోబస్తు.
కరీంనగర్ జిల్లా..
- కరీంనగర్ వన్ డిపో ముందు ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా
- తమ డిమాండ్లను నెరవేర్చాలని నినాదాలు
- తమ సమస్యల్ని పరిష్కరించి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్
- యూనియన్లను పునరుద్ధరించాలని కోరుతూ డిపో గేట్ ముందు నిరసన.
బస్సులు బంద్..
- తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది.
- అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
- సమ్మెకు దిగిన ఆర్టీసీ జేఏసీ..
- సమ్మె కారణంగా దాదాపు ఆరు వేలకు పైగా బస్సులు డిపోలకే పరిమితం.
- తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడిపేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు.
- తమ డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె కొనసాగుతుందని ప్రకటన.


