తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్డేట్స్..
సంగారెడ్డిలో ఉద్రిక్తత..
- సంగారెడ్డి ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత..
- అద్దె బస్సులను పటాన్చెరు పంపేందుకు అధికారుల యత్నం.
- బస్సులను అడ్డుకున్న కార్మికులు.
- కార్మికులను చెదరగొట్టిన పోలీసులు.
- పోలీసు ఎస్కార్ట్ వాహనంతో బస్సులను నడుపుతున్న అధికారులు.
మెదక్ జిల్లా..
- మెదక్ ఆర్టీసీ డిపోలో పోలీసులకు, ఆర్టీసీ కార్మికుల మధ్య వాగ్వివాదం..
- బస్సులను డిపోల నుండి బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్న కార్మికులు..
ప్రయాణికుల అవస్థలు..
- ఆర్టీసీ సిబ్బంది సమ్మెతో అవస్థలు పడుతున్న ప్రయాణికులు
- ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు కొన్ని డిపోల్లో ఆర్టీసీ అద్దె బస్సులను నడిపిస్తున్నారు.
- సమ్మె నేపథ్యంలో డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితమయ్యాయి.
- పికెట్, కంటోన్మెంట్, రాణిగంజ్ డిపోలలో బస్సులు నిలిచిపోయాయి.
- దీంతో ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
చర్లపల్లిలో ప్రయాణికుల ఇక్కట్లు
- ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో చర్లపల్లి రైల్వేస్టేషన్లో ప్రయాణికుల ఇక్కట్లు
- చర్లపల్లి రైల్వే స్టేషన్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- ఇదే అదనుగా ఆటో డ్రైవర్లు రేట్లు పెంచడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు రాపిడో, ఓలా, ఉబర్ను ఆశ్రయిస్తున్నారు.
గోదావరిఖనిలో బందోబస్తు..
- పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు సమ్మె చేపట్టారు.
- దీంతో బస్సులు డిపోలకే 150 బస్సులు, 600 ఉద్యోగులు పరిమితం అయ్యారు.
- గోదావరిఖని బస్టాండ్, డిపో వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
కార్మికులు విధులకు హాజరు కావాలి: ఆర్టీసీ ఎండీ
- కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది: ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
- సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నాలుగు వారాల గడువు కోరింది.
- దశల వారీగా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది.
- కార్మికులు విధులకు హాజరు కావాలి.
నోటీసు నుంచి సమ్మె వరకు
- ఆర్టీసీ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) మార్చి 13, 2026న సమ్మె నోటీసు
- ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మె
- రాత్రి వరకు ప్రభుత్వం నియమించిన ముగ్గురు ఉన్నతాధికారుల కమిటీతో కార్మిక సంఘాల నేతలు చర్చలు
- సమస్యల పరిష్కారానికి 4 వారాల సమయం కావాలని కోరిన అధికారులు
- ఇవి పాత డిమాండ్లేనని, ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపిస్తూ చర్చల నుంచి తప్పుకున్న కార్మిక సంఘాలు
- మొత్తం 32 డిమాండ్లతో చర్చలు
- ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్
- పెండింగ్లో ఉన్న 30% ఫిట్మెంట్ మరియు వేతన బకాయిల చెల్లింపు చేయాలని కోరిన కార్మిక సంఘాలు
- పీఎఫ్ (PF), సీసీఎస్ (CCS) కు సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్
- కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడం
- ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫేస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పట్టుపడుతున్న కార్మిక సంఘాలు
- మొత్తం RTC బస్సులు 9,375
- ఆర్టీసీ స్వంత బస్సులు: 6,594
- అద్దె (Hire) బస్సులు: 3,396
- సమ్మె కారణంగా దాదాపు 6,000 పైగా బస్సులు డిపోలకే పరిమితం
- సుమారు 50,000 మందికి పైగా సిబ్బంది ఉండగా, సమ్మెలో దిగిన మెజారిటీ కార్మికులు
- ఆర్టీసీ రోజువారీ ఆదాయం సుమారు రూ. 21 కోట్లు
- రోజూ ప్రయాణించే 60 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బంది
- గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి కార్మిక సంఘాలు ముందుగానే నోటీసు ఇవ్వడం, ప్రభుత్వ హామీలపై స్పష్టత కోరడం అనే వ్యూహంతో అడుగులు
- కేవలం కమిటీలతో కాలయాపన చేయకుండా, జీవో (GO) రూపంలో లేదా లిఖితపూర్వక హామీ వచ్చే వరకు సమ్మె విరమించకూడదని నిర్ణయం
- రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్ద నిరసనలు తెలుపుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయం
ఆర్టీసీ బస్సులు బంద్
చర్చలు విఫలం.. నేడు తొలి షిఫ్ట్ నుంచి ఆర్టీసీ బస్సులు బంద్
సమ్మె నోటీసు ఇచ్చిన జేఏసీకి మద్దతు ప్రకటించిన రెండో జేఏసీ
భారీగా తాత్కాలిక సిబ్బందిని సమకూర్చుకుంటున్న ఆర్టీసీ
యథావిధిగా తిరగనున్న ఎలక్ట్రిక్ బస్సులు సహా ఆర్టీసీలోని అద్దె బస్సులు
తాత్కాలిక సిబ్బందితో మరో 2 వేల బస్సులు తిప్పే యత్నం
సగానికిపైగా బస్సులు రోడ్డెక్కేలా ఆర్టీసీ యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు..
బస్సులు తిరగకుండా అడ్డుకునే ప్రయత్నంలో సంస్థ కండక్టర్లు, డ్రైవర్లు
ప్రభుత్వ ఆదేశాలు..
- జిల్లాలవారీగా ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేయాలని ఆర్డీవోలకు ప్రభుత్వం ఆదేశం.
- జీహెచ్ఎంసీ పరిధిలో వీలైనన్ని ఎక్కువ ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంచాలని ఆదేశం.
- ఎక్కడికక్కడే బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులకు తిప్పలు.
- సగానికిపైగా బస్సులు రోడ్డెక్కేలా ప్రభుత్వం చర్యలు.
జేబీఎస్లో బస్సులు బంద్..
- సమ్మె బాటలో ఆర్టీసీ ఉద్యోగులు
- జేబీఎస్లో సమ్మె ప్రభావం
- తాత్కాలిక ఉద్యోగులతో బస్సులు నడిపే ప్రయత్నం
- భారీగా పోలీసుల మోహరింపు
- ప్రశాంతంగా ధర్నా చేసుకోవాలని పోలీసుల సూచనా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
- రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె భాగంగా కొత్తగూడెంలో ఆర్టీసీ డిపోలో నిలిచిపోయిన 66 బస్సులు.
- స్వచ్ఛందంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు.
- కొత్తగూడెం ఆర్టీసీ డిపో ఎదుట సీపీఐ, ఆర్టీసీ నాయకులు ధర్నా.
- ధర్నా చేస్తున్న ఆర్టీసీ, సీపీఐ నాయకులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించిన పోలీసులు.
- బస్సులు లేక బస్టాండ్లో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు.
- ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల భారీ బందోబస్తు.
కరీంనగర్ జిల్లా..
- కరీంనగర్ వన్ డిపో ముందు ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా
- తమ డిమాండ్లను నెరవేర్చాలని నినాదాలు
- తమ సమస్యల్ని పరిష్కరించి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్
- యూనియన్లను పునరుద్ధరించాలని కోరుతూ డిపో గేట్ ముందు నిరసన.
బస్సులు బంద్..
- తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది.
- అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
- సమ్మెకు దిగిన ఆర్టీసీ జేఏసీ..
- సమ్మె కారణంగా దాదాపు ఆరు వేలకు పైగా బస్సులు డిపోలకే పరిమితం.
- తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడిపేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు.
- తమ డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె కొనసాగుతుందని ప్రకటన.


