రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి
కడప సెవెన్రోడ్స్: రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో అన్ని మండలాల తహసీల్దార్లతో 22 ఏ, మ్యూటేషన్, వెబ్ ల్యాండ్ కరెక్షన్స్, తదితర రెవెన్యూ సంబంధిత అంశాలపై మండలాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా రెవిన్యూ క్లినిక్ ల నిర్వహణ ద్వారా పరిష్కారం పై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ నిధి మీనా, డీఆర్ఓ విశ్వేశ్వర్ నాయుడు, రాజంపేట సబ్ కలెక్టర్ భావన, కడప,జమ్మల మడుగు, బద్వేలు,పులివెందుల ఆర్డీఓలు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శాంతరాజ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి


