ప్రొద్దుటూరులో ‘కేవీ’ ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రొద్దుటూరులో ‘కేవీ’ ఏర్పాటు చేయాలి

Dec 17 2025 7:13 AM | Updated on Dec 17 2025 7:13 AM

ప్రొద

ప్రొద్దుటూరులో ‘కేవీ’ ఏర్పాటు చేయాలి

ప్రొద్దుటూరులో ‘కేవీ’ ఏర్పాటు చేయాలి ● మృత్యు కుహరంగా హైలెవల్‌ వంతెన

ప్రతి చోట బ్లాక్‌ స్పాట్స్‌

సరైన అలైన్‌మెంట్‌ లేదు : మేడా

కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి

కడప సెవెన్‌రోడ్స్‌: ప్రొద్దుటూరు పట్టణంలో కేంద్రీయ విద్యాలయం (కేవీ) ఏర్పాటు చేయాలని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్‌ అవినాష్‌రెడ్డి కోరారు. మంగళవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఆయన వినతిపత్రం సమర్పించారు. ప్రొద్దుటూరులో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన ఎంతో మంది ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పలు కేంద్రీయ విద్యాలయాలను ఆంధ్రప్రదేశ్‌లోని చిన్నచిన్న పట్టణాలకు మంజూరు చేసిందని తెలిపారు. వీటితో పోల్చుకుంటే ప్రొద్దుటూరు జనాభా పరంగా పెద్దదని, పాలనా పరమైన ప్రాధాన్యత, విద్యా పరమైన అవసరాలు ఉన్నాయన్నారు. ప్రొద్దుటూరు పట్టణానికి కేంద్రీయ విద్యాలయం మంజూరు చేస్తే అందుకు అవసరమైన భూమిని కేటాయించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్య క్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి పాల్గొన్నారు.

రైళ్ల పొడిగింపు, స్టాపింగ్‌పై వినతి

ముద్దనూరు: కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఢిల్లీలో కేంద్ర రైల్వేశాఖామంత్రి అశ్వనీ వైష్ణవ్‌ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మైసూరు–రేణిగుంట ఽమధ్య నడిచే వీక్లీ స్పెషల్‌ ట్రైన్‌(22135–22136)ను కడప నగరం వరకు పొడిగించాలని కోరారు. ఈ వీక్లీ రైలు రేణిగుంటలో దాదాపు 10 గంటలు పాటు నిరుపయోగంగా నిలిచివుంటుందని, ఈ సమయంలో కడప వరకు రైలు ప్రయాణాన్ని పొడిగిస్తే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా వుంటుందని కోరారు. కడప ప్రజలు ఎంతో కాలం నుంచి కడప నుంచి బెంగుళూరుకు రైలు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారని, మైసూరు–రేణిగుంట మధ్య నడిచే ఈ రైలును కడప వరకు నడిపితే బెంగుళూరుకు వెళ్లడానికి ప్రయాణికులకు సౌకర్యవంతంగా వుంటుందని తెలిపారు.

ముద్దనూరులో..

ముద్దనూరు–మచిలీపట్నం (ట్రైన్‌ నం.17215– 17216)ల మధ్య నడిచే రైలుకు ముద్దనూరులో స్టాపింగ్‌ సౌకర్యం కల్పంచాలని కోరారు. జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గాలకు ముద్దనూరు ప్రధాన రైల్వేస్టేషన్‌ అని, ఈ రైలు స్టాపింగ్‌ వల్ల ఎంతో ప్రయోజనకరమని తెలిపారు.

రాజంపేట: కడప–రేణిగుంట హైవే.. డేంజర్‌ జోన్‌గా మారిందనే అంశం పార్లమెంట్‌లో కూడా చర్చకు వచ్చింది. రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి కడప–రేణిగుంట జాతీయ రహదారి దుస్థితిపై గళం విప్పారు. సరైన అలైన్‌మెంట్‌ లేదని, నైట్‌ జర్నీ యమడేంజర్‌గా ఉందని తెలియజేశారు. వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించే పరిస్థితులు ఉన్నాయని చెప్పుకురావడంతో ఈ అంశం కేంద్ర రవాణాశాఖను తాకింది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదం సంభవిస్తోంది. హైవే దారంతా రక్తపు మరకలే కనిపిస్తున్నాయి. నిత్యం ప్రమాదాలు కొనసాగుతున్నాయి. ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. రెండు దశాబ్దాల కిందట సింగిల్‌ రోడ్డుగా ఉన్న రహదారిని వెడల్పు చేసి స్టేట్‌ హైవే డబుల్‌ రోడ్డుగా మార్చారు. ఉభయ వైఎస్సార్‌ జిల్లాలో ఈ రోడ్డు కొనసాగుతోంది.

ప్రయాణం.. భయానకం

ప్రస్తుత హైవే వెంట ప్రయాణం భయానకంగా మారింది. ఎటువైపు నుంచి ప్రమాదం పొంచి ఉందో తెలియని పరిస్థితి. కడప శివార్లలోని జేఎంజే కళాశాల నుంచి భాకరాపేట సర్కిల్‌, మాధవరం, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, పుల్లంపేట, ఓబులవారిపల్లె, మంగంపేట, రైల్వేకోడూరు, శెట్టిగుంట, కుక్కులదొడ్డి వరకు హైవేలో రహదారి ప్రయాణం కత్తి మీద సాములా మారింది. మార్గంలో అనేక ప్రమాదకర మలుపులు ఉన్నాయి. ఒంటిమిట్ట, నందలూరు, రెడ్డిపల్లె చెరువుకట్టలపై రహదారి ఉంది. అనేక మార్లు వాహనాలు అదుపు తప్పి చెరువుల్లో పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. దక్షిణ భారతదేశం నుంచి తిరుమలకు కడప–రేణిగుంట మార్గం మీదుగా వేలాది మంది యాత్రికులు వాహనాల్లో ప్రయాణం చేస్తుంటారు. తెలంగాణా, మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు రాజస్తాన్‌, యూపీ తదితర రాష్ట్రాల నుంచి కూడా యాత్రికులు ఈ రోడు మార్గాన్నే వెళుతుంటారు. తుపాన్‌తోపాటు రకరకాల ఫోర్‌వీల్‌ వాహనాల్లో యాత్ర కొనసాగించడం అధికంగా ఉంటుంది. పలుమార్లు వాహనాలు ప్రమాదాలకు గురైన సంఘటనలు ఉన్నాయి.

పెరుగుతున్న ట్రాఫిక్‌

కడప–రేణిగుంట హైవేలో రోజురోజుకు ట్రాఫిక్‌ పెరుగుతోంది. ఈ మార్గం మీదుగా తిరుపతి, చైన్నె, ముంబయి, హైదరాబాద్‌కు రాకపోకలు కొనసాగుతున్నాయి. నిత్యం 17 వేలకు పైగా వాహనాలు హైవేపై పరుగులు తీస్తున్నాయి. ఈ ట్రాఫిక్‌కు ప్రస్తుతం ఉన్న హైవే కెపాసిటీ సరిపోవడం లేదు. ఫలితంగా ప్రమాదాలు, ట్రాఫిక్‌ స్తంభించడం తరుచూ జరుగుతున్నాయి. అంతే గాకుండా కడప–రేణిగుంట రోడ్డు ప్రయాణం రెండు నుంచి మూడు గంటలకు పైగా పడుతోంది. సకాలంలో గమ్యాలకు చేరలేని పరిస్థితి ఉంది.

కడప–రేణిగుంట హైవేలో ప్రతి మండల పరిధిలో బ్లాక్‌ స్పాట్స్‌ను గుర్తించారు. రాజంపేట అర్బన్‌లో 3, నందలూరు 2, , రైల్వేకోడూరు 3, పుల్లంపేట 3 ఓబలవారిపల్లె 6, మన్నూరు 3 ఉన్నట్లు గుర్తించారు. ప్రత్యేక బృందాలు సర్వే చేసి కడప–రేణిగుంట ప్రస్తుత హైవేలో ప్రమాదాలు జరుగుతున్నాయని నిర్ధారణకు వచ్చింది. ఈ క్రమంలో పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట పెద్దాసుపత్రిలో ట్రామా సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు అందుబాటులో లేదనే సంగతి విదితమే.

అధ్వానస్థితిలో కడప–రేణిగుంట హైవే

ప్రమాదకర మలుపులు

ప్రాణాలు పోతున్న వైనం

పార్లమెంట్‌లో గళం విప్పినమేడా రఘునాథరెడ్డి

కడప–రేణిగుంట హైవేకు సరైన అలైన్‌మెంటట్‌ లేదని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి పార్లమెంట్‌ సాక్షిగా గళం విప్పారు. ప్రమాదాలకు నిలయంగా మారిందన్నారు. మలుపులు ఉన్నాయని, రాత్రి పూట ప్రయాణం భయంకరంగా ఉంటుందన్నారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారిందన్నారు. ఈ విషయంలో కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుని ప్రమాదరహిత రహదారిగా మార్చాలని కోరారు.

కడప –రేణిగుంట నేషనల్‌ హైవేలోని నందలూరు చెయ్యేరు నదిపై నిర్మించి వంతెన(బ్రిడ్జి) ప్రమాదాలకు నిలయంగా నిలిచిపోయింది. వంతెనపై ప్రమాద నివారణ చర్యలేవి కనిపించడం లేదు. వంతెన మధ్యలో ఉన్న బీటి (తారు)రోడ్డు అస్తవ్యస్తంగా తయారైంది. రోడ్డు మధ్యలో గుంతలు పడ్డాయి. బ్రిడ్జిపై వేగాన్ని నిరోధించే విధంగా బోర్డులు, స్పీడ్‌ బ్రేకర్లు కూడా వేయలేదు. రాత్రి వేళలో వంతెనపై చీకటిగా ఉండటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవడమే కాకుండా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ బ్రిడ్జి సగం మన్నూరు, మరో సగం నందలూరు పోలీసు స్టేషన్ల పరిధిలోకి వస్తాయి. కిలోమీటర్లకు పైగా పొడవు కలిగిన ఈ వంతెన మృత్యుకుహరంగా మారింది.

ప్రొద్దుటూరులో ‘కేవీ’ ఏర్పాటు చేయాలి1
1/4

ప్రొద్దుటూరులో ‘కేవీ’ ఏర్పాటు చేయాలి

ప్రొద్దుటూరులో ‘కేవీ’ ఏర్పాటు చేయాలి2
2/4

ప్రొద్దుటూరులో ‘కేవీ’ ఏర్పాటు చేయాలి

ప్రొద్దుటూరులో ‘కేవీ’ ఏర్పాటు చేయాలి3
3/4

ప్రొద్దుటూరులో ‘కేవీ’ ఏర్పాటు చేయాలి

ప్రొద్దుటూరులో ‘కేవీ’ ఏర్పాటు చేయాలి4
4/4

ప్రొద్దుటూరులో ‘కేవీ’ ఏర్పాటు చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement