
ఉగ్రదాడిని నిరసిస్తూ ఏపీయూడబ్ల్యుజే కొవ్వొత్తుల ప్రదర్శ
కడప కార్పొరేషన్ : జమ్మూ, కాశ్మీర్లో ఉగ్రవాదుల మారణకాండను నిరసిస్తూ ఏపీయూడబ్ల్యుజే, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా, వీడియోగ్రాఫర్, ఫొటోగ్రాఫర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్టులు శనివారం సాయంత్రం కోటిరెడ్డి సర్కిల్ నుంచి ఎర్రముక్కపల్లె సర్కిల్ వరకూ జాతీయ జెండాలు చేతబూని ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎర్రముక్కపల్లె సర్కిల్లో కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యుజే రాష్ట్ర కార్యదర్శి పి. రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు అంత్యంత పాశవికంగా కాల్పులు జరిపి 26 మంది అమాయకులను పొట్టనబెట్టుకోవడం దుర్మార్గమన్నారు. ఈ చర్యకు పాల్పడిన ఉగ్రవాదులను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ ఎన్ని కుట్రలు చేసినా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయలేదని హెచ్చరించారు. ఉగ్రదాడిలో మరణించిన వారికి ప్రగాఢ సంతాపం, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎం. బాలక్రిష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, నాయకులు వెన్ను రశ్రీనివాసరావు, ఆంజనేయులు, రమణారెడ్డి, ఫోటో, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు, వర్కింగ్ జర్నలిస్టులు, కెమెరామెన్లు పాల్గొన్నారు.