బ్యాడ్మింటన్‌ చాంపియన్‌లుగా నాగరాజు– నితిన్‌ జోడీ | - | Sakshi
Sakshi News home page

బ్యాడ్మింటన్‌ చాంపియన్‌లుగా నాగరాజు– నితిన్‌ జోడీ

Mar 25 2025 1:34 AM | Updated on Mar 25 2025 1:30 AM

కడప అర్బన్‌ : న్యాయశాఖ ఉద్యోగుల బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ విజేతలుగా నాగరాజు – నితిన్‌ జోడి నిలిచింది. కడప నగరం పక్కీరుపల్లెలోని పీవీఆర్‌ ఇండోర్‌ స్టేడియంలో న్యాయశాఖ ఉద్యోగుల బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ ముగింపు కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అదనపు న్యాయమూర్తి రామారావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్‌. బాబా ఫక్రుద్దీన్‌ హాజరై విజేతలను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో క్రీడాకారులు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని చక్కటి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారని అభినందించారు. కాగా టోర్నీలో రన్నరప్‌గా నరసింహారెడ్డి – ప్రభాకర్‌ రెడ్డి జోడీ నిలిచింది.

రన్నరప్‌గా నరసింహారెడ్డి – ప్రభాకర్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement