ఇష్టానుసారంగా తవ్వకాలు | - | Sakshi
Sakshi News home page

ఇష్టానుసారంగా తవ్వకాలు

Mar 23 2025 12:22 AM | Updated on Mar 23 2025 12:22 AM

ఇష్టా

ఇష్టానుసారంగా తవ్వకాలు

నాకు 2.5 ఎకరాల పొలం చెరువు దగ్గర ఉంది. వరి సాగుచేస్తున్నాను. చెరువులో మట్టిని ఇష్టం వచ్చినట్లు తోడేస్తున్నారు. 15 అడుగుల లోతు మట్టిని తీసుస్తున్నారు. చెరువు ధ్వంసం అవుతోంది. చెరువుకు నీరు వచ్చినా నిల్వ ఉండదు. బోర్లకు నీరు రాదు. రైతులకు తీరని నష్టం కలుగుతుంది.

– బుక్కే హేమలా నాయక్‌,

నాగసానిపల్లె ఎస్టీకాలనీ

చెరువులో మట్టిపోతే నీరు కష్టం

నాకు చెరువు కింద ఎకరా పొలం ఉంది. వరి సాగుచేస్తున్నాను. ఇంత లోతుగా మట్టిని తీస్తే తూముకు నీరు చేరెదేప్పుడు.. కాలువకు నీరు వచ్చేదెప్పుడు?. బోరునుంచి నీరు వచ్చేలా కనిపించడం లేదు. మట్టి తవ్వకాలను వెంటనే ఆపాలి.

– బాబా నాయక్‌, నాగసానిపల్లె ఎస్టీకాలనీ

చెరువు దెబ్బతింటే రైతులేంకావాలి

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మట్టిని చెరువు నుంచి తోడేస్తున్నారు.. రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తున్నారు. చెరువు మా గ్రామానికి అవసరం. రోడ్డు కోసం మట్టి కావాలంటే కొండల నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి తీసుకోవచ్చు.. చెరువు దెబ్బతింటే రైతులంతా ఎంకావాలి.. మట్టిని తరలిస్తే ఓప్పుకునేది లేదు. – బలరామ్‌ నాయక్‌,

ఏఐవైఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్టీకాలనీ

అనుమతులు తీసుకున్నాం

నాగసానిపల్లి చెరువు నుంచి జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకున్నాం.. రెండు లక్షల క్యూబిక్‌ మీటర్ల వరకు మట్టిని తీసుకెళ్లవచ్చు. జాతీయ రహదారి నిర్మాణం కోసమే మట్టిని వాడుతున్నాం, ఇతర అవసరాలకు కాదు. ఎక్కడ హెచ్చుతగ్గులు లేకుండా, రైతులకు ఇబ్బందులు లేకుండా మట్టిని తీసుకెళుతున్నాం. – జయప్రకాష్‌,

కాంట్రాక్ట్‌ నిర్వహణ అధికారి

ఇష్టానుసారంగా తవ్వకాలు
1
1/2

ఇష్టానుసారంగా తవ్వకాలు

ఇష్టానుసారంగా తవ్వకాలు
2
2/2

ఇష్టానుసారంగా తవ్వకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement