
● 2024లో నాసిరకం అద్దాలకు అడ్డుకట్ట..
విద్యార్థులకు కళ్లద్దాల పంపిణీ కార్యక్రమం 2024లో కూడా జరిగింది. అప్పుడు టెండర్లను ఆహ్వానించినప్పుడు పంపిణీదారులకు ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అప్పట్లో ప్రకాశం జిల్లాకు చెందిన పంపిణీదారుడు టెండరులో పాల్గొన్నారు. రూ.180కే నాణ్యమైన కళ్లద్దాలను పంపిణీ చేస్తానని టెండర్ వేశారు. కడప నగరానికి చెందిన ఇదే వ్యక్తి నాడు రూ.168కే పంపిణీ చేస్తానని టెండర్ దక్కించుకున్నారు. ఈ పంపిణీదారుడు అప్పుడు కూడా నమూనాగా నాణ్యమైన కళ్ల జోళ్లను చూపి నాసిరకం అద్దాలను పంపిణీ చేసేందుకు యత్నించారు. దీంతో ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి అడ్డుతగిలారు. కడప నగరానికి చెందిన పంపిణీదారుడు నాసిరకం అద్దాలు పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో కడప పంపిణీదారుడు గత్యంతరం లేక నాణ్యమైన కళ్లద్దాలు పంపిణీ చేయడంతో గొడవ సద్దుమణిగింది.