కడప రూరల్ : ‘డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ’(ఆరోగ్య శ్రీ)లో పనిచేస్తున్న సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం విధుల బహిష్కరించి..నిరసన తెలిపారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 108 నెట్ వర్క్ ఆసుపత్రులకు వచ్చిన పేదలు ఉచిత వైద్యసేవలు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వ్యాధులతో నెట్ వర్క్ ఆసుపత్రులకు వచ్చే పేదలు అక్కడ ఉన్న ‘ఆరోగ్య మిత్ర’హెల్ప్ డెస్క్ను సంప్రదిస్తే రోగుల రిజిస్ట్రేషన్తో పాటు అన్ని అంశాలు వారే పర్యవేక్షిస్తారు. ఆరోగ్య మిత్రలు విధులను బహిష్కరించడంతో ప్రభుత్వం ఆరోగ్య మిత్రల రోల్ను ఆసుపత్రులకే అప్పగించింది. వారు చాలా ఆసుపత్రుల్లో అత్యవసరమైన అంటే ఇన్ పేషెంట్స్కు మాత్రమే వైద్య సేవలు అందించారు. కొన్ని చోట్ల అది కూడా జరగలేదని సమాచారం. మిగతా వారిని ఆసుపత్రి సిబ్బంది నేడు బంద్..రేపు రండి అని చెప్పి పంపించారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాధిగ్రస్తులు తమ బాధను ఎవరికీ చెప్పుకోలేక ఆవేదనతో వెనుతిరిగి వెళ్లారు. కొంతమంది వెనుతిరిగి వెళ్లలేక..అనారోగ్యం బాధను తట్టుకోలేక వైద్యుడికి ఫీజును చెల్లించి వైద్య చికిత్సను పొందారు. మొత్తం మీద వైద్య సేవ సిబ్బంది ఒక్కరోజు విధులను బహిష్కరించినందుకే దాదాపు 3,255 రకాలకు చెందిన వైద్య సేవలకు ఆటంకం ఏర్పడింది. 2007–2008లో నాటి సీఎం వైఎస్సార్ ఆరోగ్య శ్రీని ప్రవేశపెట్టారు. నాటి నుంచి ఇప్పటి వరకూ ఏ రోజు వైద్య సేవలు నిలిచిపోలేదు. ఎప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చినా ఆరోగ్య శ్రీ ఆటుపోట్లను ఎదుర్కొంటుంది. ఇప్పుడు ఏకంగా వైద్య సేవలే నిలిచిపోవడం గమనార్హం.
‘డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ’సిబ్బంది విధుల బహిష్కరణ
ఇబ్బందులు పడిన రోగులు
‘ఆరోగ్య శ్రీ’పథకం చరిత్రలో విధులను బహిష్కరించడం ఇదే ప్రఽథమం
ఇతని పేరు బాబాసాహెబ్. వయసు 35 ఏళ్లు. కడప నగరం ఆజాద్నగర్కు చెందిన ఇతను వారం రోజుల క్రితం అనారోగ్యం పరిస్థితుల్లో 108లో రిమ్స్లో చేరాడు. మొదట ఆయాసం, జలుబు, దగ్గుతో చేరాడు. చేరిన సమయంలో వైద్యసేవల అనంతరం వివిధ వైద్య పరీక్షలను చేసిన డాక్టర్లు ఇతనికి ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరడం వల్ల తిరుపతి స్విమ్స్కు రెఫర్ చేశారు. ఈ రెఫర్కు సంబంధించిన వివరాలను నమోదు చేసేందుకు కడప రిమ్స్ ఐపీ విభాగంలో ‘ఎన్టీఆర్ వైద్య సేవ’ సిబ్బందిలో ఇద్దరు మాత్రమే విధుల్లో ఉన్నారు. దాదాపు గంటకు పైగా సమయం పట్టడంతో అల్లాడిపోయాడు.
బాబు పాలనలో అందరికీ ఇబ్బంద్లే !
బాబు పాలనలో అందరికీ ఇబ్బంద్లే !
బాబు పాలనలో అందరికీ ఇబ్బంద్లే !