చిన్న వెంకన్న ఆలయ గోపురాలు శుభ్రం | - | Sakshi
Sakshi News home page

చిన్న వెంకన్న ఆలయ గోపురాలు శుభ్రం

Apr 18 2026 8:11 AM | Updated on Apr 18 2026 8:11 AM

చిన్న వెంకన్న ఆలయ గోపురాలు శుభ్రం

ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయ గోపురాలపై మొలి చిన మొక్కల తొలగింపునకు అధికారులు శుక్రవారం చర్యలు చేపట్టారు. రావి, మర్రి మొక్కలతో ఆలయ రాజగోపురాలు కళావిహీనంగా దర్శనమిస్తున్నాయని, శిల్ప సంపద ధ్వంసం కావడానికి కారణం అవుతు న్నాయని సాక్షి దినపత్రికలో శుక్రవారం ‘మొక్క’వోని నిర్లక్ష్యం శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన అధికారులు గోపురాలపై ఉన్న మొక్కల తొలగింపు పనులు చేప ట్టారు. తొలిరోజు ఈ పనులు ముందుకు సాగలేదు. ప్రధాన(దక్షిణ) రాజగోపురానికి నిచ్చెన వేసుకుని మొక్కలు తొలగించడం సిబ్బందికి సాధ్యం కాకపోవడమే ఇందుకు కారణం.

Advertisement
 
Advertisement
Advertisement