పాలిసెట్‌కు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

పాలిసెట్‌కు ఏర్పాట్లు

Apr 24 2025 8:35 AM | Updated on Apr 24 2025 8:35 AM

పాలిసెట్‌కు ఏర్పాట్లు

పాలిసెట్‌కు ఏర్పాట్లు

డీఆర్‌ఓ మొగిలి వెంకటేశ్వర్లు

భీమవరం: పాలీసెట్‌ ప్రవేశ పరీక్షల నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని డీఆర్‌ఓ మొగిలి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ వశిష్ట సమావేశ మందిరంలో వీఆర్వో పాలిశెట్టి–2025 ప్రవేశ పరీక్ష నిర్వహణపై కో ఆర్డినేటర్లు, అసిస్టెంట్‌ కో ఆర్డినేటర్లు, సంబంధిత శాఖల సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ మాట్లాడుతూ ఏప్రిల్‌ 30న జరగనున్న పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో మొత్తం 18 సెంటర్ల పరీక్షల నిర్వహణకు ఏర్పాటు చేయగా వీటిలో భీమవరంలో 4, తాడేపల్లిగూడెంలో 2, తణుకులో 8, నరసాపురంలో 4 పరీక్ష కేంద్రాలు ఉన్నాయన్నారు. మొత్తం 7,254 మంది విద్యార్థులు పాలీసెట్‌ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ 30న ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆయా సెంటర్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు. సెల్‌ఫోన్లు, వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమన్నారు. పరీక్షా కేంద్రాలు దగ్గరలో జిరాక్స్‌ షాపులు మూసివేయాలని, పరీక్ష కేంద్రం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని అన్నారు. జిల్లా ఖజానా అధికారి ఏ గణేష్‌, డిప్యూటీ తహసీల్దార్‌ ఎం.సన్యాసిరావు, కోఆర్డినేటర్‌ డి.ఫణీంద్ర ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement