అన్ని ఏర్పాట్లు చేశాం..
కొల్లాపూర్: శ్రీశైలం డ్యాం బ్యాక్వాటర్ లెవెల్స్ క్రమంగా తగ్గుతుండటంతో తాగునీటి అవసరాలపై అధికారులు దృష్టిసారించారు. మిషన్ భగీరథ పథకానికి నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. కొల్లాపూర్ మండలం ఎల్లూరులో ఏర్పాటుచేసిన మిషన్ భగీరథ స్కీంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మొత్తం 84 మండలాలకు తాగునీరు అందుతోంది. వేసవిలో ప్రజలకు తాగునీటి ఇక్కట్లు తలెత్తకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు.
సరఫరా ఇలా..
ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టుకు అనుసంధానంగా కొల్లాపూర్ మండలం ఎల్లూరులో మిషన్ భగీరథ పంప్హౌజ్ నిర్మించారు. ఇక్కడి నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లా ప్రజలకు తాగునీరు అందించేందుకు పైప్లైన్లు, వాటర్ట్యాంకులు నిర్మించి.. నీటి సరఫరా చేస్తున్నారు.
తగ్గుతున్న నీటిమట్టం..
కృష్ణానదిలో కొన్ని రోజులుగా నీటిమట్టం భారీగా తగ్గుతోంది. ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో 820 అడుగుల మేరకు నీటిమట్టం ఉంది. మిషన్ భగీరథ కోసం 800 అడుగుల వరకు నీటిని వినియోగించుకునే వెసులుబాటు ఉంది. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం తాగు, సాగునీటి అవసరాల కోసం నీటిని ఎత్తిపోస్తున్నారు. యాసంగి సీజన్ ముగింపునకు చేరడంతో సాగునీటి సరఫరా నిలిపివేసి.. కేవలం మిషన్ భగీరథ కోసమే నీటిని వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు.
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఓపెన్ స్కూల్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. వేసవి నేపథ్యంలో ప్రత్యేకంగా చర్యలు తీసుకోనున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పదో తరగతికి సంబంధించి 19 కేంద్రాలు ఏర్పాటు చేయగా 3,389 మంది పరీక్ష రాయనున్నారు. అలాగే ఇంటర్కు సంబంధించి 29 సెంటర్లు ఏర్పాటు చేయగా 5,782 మంది విద్యార్థులు ఇంటర్ 29 సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. వేసవి నేపథ్యంలో పూర్తిస్థాయిలో పరీక్ష కేంద్రాల్లో అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. తాగునీరు, ఓఆర్ఎస్ పాకెట్లతోపాటు ఏఎన్ఎంలను కూడా పరీక్ష కేంద్రాల్లో అందుబాటులో ఉంచనున్నారు. అలాగే కాపీయింగ్ జరగకుండా ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు.
ప్రస్తుతం ఎలాంటి
ఇబ్బందులు లేవు..
ప్రస్తుతం తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కేఎల్ఐ ప్రాజెక్టు వద్ద 820 అడుగుల మేరకు కృష్ణా బ్యాక్వాటర్ ఉంది. 800 అడుగుల వరకు తాగునీటి అవసరాలకు నీటిని ఎత్తిపోసుకోవచ్చు. తాగునీటి అవసరాల మేరకు ఎత్తిపోతలు సాగుతున్నాయి. కృష్ణా బ్యాక్వాటర్ నిల్వలు, మిషన్ భగీరథ అవసరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నాం. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథకు నీటిని మళ్లించేందుకు చేపట్టిన పనులు తుదిదశకు చేరాయి. ఈ పనులు పూర్తయితే తాగునీటి అవసరాలకు ఇక ఢోకా ఉండదు.
– అంజాద్ పాషా, డీఈఈ, మిషన్ భగీరథ
ఉమ్మడి జిల్లా పరిధిలో ఇలా..
‘మిషన్ భగీరథశ్రీకు కేఎల్ఐ ద్వారా ఎత్తిపోతలు
ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో 820 అడుగుల నీటిమట్టం
800 అడుగుల వరకు నీటిని
ఎత్తిపోసుకునే అవకాశం
వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారుల చర్యలు
రోజూ 0.02 టీఎంసీలు అవసరం
మిషన్ భగీరథ పథకానికి రోజూ 0.02 టీఎంసీల నీరు అవసరం. కేఎల్ఐ పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 0.36 టీఎంసీలు. ఒకసారి రిజర్వాయర్ను నింపితే.. దాదాపుగా 18 రోజులపాటు తాగునీటి అవసరాలు తీరుతాయి. అయితే వేసవిలో ఎల్లూరు రిజర్వాయర్లో ఉన్న నీటి నిల్వ ప్రజల అవసరాలకు ఏమాత్రం సరిపోదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు ముందుజాగ్రత్తగా పాలమూరు ప్రాజెక్టు పరిధిలోని నార్లాపూర్ రిజర్వాయర్లో 4 టీఎంసీలకు పైగా నీటిని నిల్వచేసి ఉంచారు. ఈ నీటిని మిషన్ భగీరథకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సున్నపుతండా వద్ద రూ. 10కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రెగ్యులేటరీ సిస్టమ్ పనులు కూడా తుది దశకు చేరాయి. ఈ పనులు పూర్తయితే ఇకనుంచి రెగ్యులర్గా నార్లాపూర్ రిజర్వాయర్ నుంచే మిషన్ భగీరథకు నీటిని సరఫరా చేయవచ్చు. ఇది అమలైతే కేఎల్ఐ ప్రాజెక్టుపై ఇన్నాళ్ల నుంచి పడుతున్న ఒత్తిడి తగ్గుతోంది.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశాం. వేసవి నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. కాపీయింగ్ను అరికట్టేందుకు ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ను నియమించాం.
– శివయ్య, ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్


