చలో వరంగల్‌.. | - | Sakshi
Sakshi News home page

చలో వరంగల్‌..

Apr 27 2025 12:24 AM | Updated on Apr 27 2025 12:24 AM

చలో వరంగల్‌..

చలో వరంగల్‌..

బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో రజతోత్సవ సందడి

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ‘గులాబీ’ శ్రేణుల్లో రజతోత్సవ సందడి నెలకొంది. బీఆర్‌ఎస్‌ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తికానున్న సందర్భంగా వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో ఆదివారం నిర్వహిస్తున్న రజతోత్సవ సభను ఉమ్మడి పాలమూరుకు చెందిన ఆ పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ మేరకు భారీ జనసమీకరణకు ఇదివరకే సన్నాహాలు మొదలుపెట్టిన నేతలు.. తాము రూపొందించుకున్న ప్రణాళికలకు అనుగుణంగా ముందుకుసాగుతున్నారు. నేడు ఊరూరా పార్టీ జెండావిష్కరణలను పండుగ వాతావారణంలో నిర్వహించి.. అనంతరం వాహనాల్లో సభకు తరలేలా తగిన ఏర్పాట్లు చేశారు. జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో శనివారం సైతం పార్టీ జెండాలు ఆవిష్కరించారు. అదేవిధంగా ఫ్లెక్సీలు, పార్టీ బ్యానర్లతో మహబూబ్‌నగర్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాకేంద్రాల్లో పలు కూడళ్లు గులాబీమయంగా మారాయి.

సెగ్మెంట్‌కు 300 వాహనాలు..

3 వేల మంది జనసమీకరణ

వరంగల్‌ జిల్లాలో జరిగే బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు భారీగా పార్టీ శ్రేణులను తరలింపు కోసం ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డితోపాటు ఎమ్మెల్సీ, అలంపూర్‌ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు నియోజకవర్గానికి 300 వాహనాల వరకు సిద్ధం చేసి.. సుమారు మూడు వేల మంది కార్యకర్తలను సభకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. రజతోత్సవ సభకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి దాదాపు 50 వేల మందిని తరలించనున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడించారు.

పర్యవేక్షణకు ఇన్‌చార్జీల నియామకం..

వరంగల్‌కు సుదూర ప్రయాణం చేయాల్సి ఉన్నందున ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కోసం పార్టీ నేతలకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ప్రతి వాహనానికి ఓ ఇన్‌చార్జితో పాటు భోజనం, తాగునీటి వసతుల పర్యవేక్షణకు విడివిడిగా ఇన్‌చార్జీలను నియమించారు. అదేవిధంగా సభకు వెళ్లే ప్రతి వాహనానికి సంఖ్య, ఇన్‌చార్జి పేరు, సెల్‌ నంబర్‌తో స్టిక్కర్‌ ఏర్పాటు చేయనున్నారు. ఆయా ఇన్‌చార్జీలు నియోజకవర్గ ఇన్‌చార్జితో సమన్వయం చేసుకోనున్నారు. వాహనాలు ఎక్కడి నుంచి బయలు దేరాయి.. ఎక్కడ భోజనాలు చేశారు.. ఎప్పుడు సభకు వచ్చారు.. ఎ ప్పుడు వెళ్లారు.. ఇలా సురక్షితంగా ఇంటికి చేరుకునే వరకు ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జీలు ప ర్యవేక్షించేలా పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేసింది.

పాలమాకుల లేదంటే శంషాబాద్‌ నుంచి

ఓఆర్‌ఆర్‌కు..

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి వాహనాలు పాలమాకుల దాటిన తర్వాత లేదా శంషాబాద్‌ వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)పైకి చేరుకుని.. నేరుగా ఘట్‌కేసర్‌ వద్ద వరంగల్‌ హైవేలో దిగుతాయి. ఈ క్రమంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు సమీపంలో భోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

జోన్‌–2లో పార్కింగ్‌..

రజతోత్సవ సభకు తరలివెళ్లే ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తమ తమ వాహనాలను జోన్‌–2లో పార్కింగ్‌ చేసుకోవాలి. వరంగల్‌ జాతీయ రహదారిలో కరుణాపురం వద్ద ఎన్‌హెచ్‌–163 బైపాస్‌లో టోల్‌గేట్‌ నుంచి దేవన్నపేట, మేడిపల్లి, అనంతసాగర్‌ మీదుగా పార్కింగ్‌ స్థలానికి చేరుకోవాల్సి ఉంటుంది. వాహనాలను అక్కడ పార్కింగ్‌ చేసి నేరుగా సభావేదిక స్థలానికి వెళ్లాల్సి ఉంటుంది.

వరంగల్‌ సభకు భారీగా తరలుతున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు

ఉమ్మడి పాలమూరు నుంచి సుమారు 50 వేల మంది తరలింపు

బస్సులు, కార్లు ఇతర ప్రైవేట్‌

వాహనాలను సమకూర్చిన నేతలు

పట్టణాలతో పాటు ఊరూరా

పండుగలా పార్టీ జెండావిష్కరణలు

ఫ్లెక్సీలు, బ్యానర్లతో

గులాబీమయమైన పలు కూడళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement