పోటీ పరీక్షల అవగాహన సదస్సుకు విశేష స్పందన | - | Sakshi
Sakshi News home page

పోటీ పరీక్షల అవగాహన సదస్సుకు విశేష స్పందన

Jan 19 2026 4:04 AM | Updated on Jan 19 2026 4:04 AM

పోటీ పరీక్షల అవగాహన సదస్సుకు విశేష స్పందన

పోటీ పరీక్షల అవగాహన సదస్సుకు విశేష స్పందన

తగరపువలస: స్థానిక రాజుల తాళ్లవలసలో గల తిరుమల ఐఐటీ, మెడికల్‌ అకాడమీలో జేఈ మెయిన్స్‌, అడ్వాన్స్‌డ్‌, నీట్‌ పరీక్షలపై ఆదివారం నిర్వహించిన అవగాహన సదస్సుకు భారీ ఎత్తున స్పందన లభించింది. సుమారు 8 వేల మంది సదస్సుకు హాజరయ్యారని కళాశాల రెసిడెంట్‌ డైరెక్టర్లు ఇ. మృత్యుంజయరావు, కె. సత్యనారాయణ తెలిపారు. 6,7,8,9,10, ఇంటర్‌ విద్యార్థులకు ఈ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో వివరించినట్లు తెలిపారు. పిల్లలు క్రమశిక్షణతో ఎలా మెలగాలి, వారి ప్రగతికి తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి అనే విషయాలు వివరించారు. పిల్లల్లో చదువుకు సంబంధించిన అడ్డంకులు, వారికి ఎదురయ్యే సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో వివరంగా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement