రక్తదానంతో ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

రక్తదానంతో ఆరోగ్యం

Jun 14 2025 6:33 AM | Updated on Jun 14 2025 6:33 AM

రక్తదానంతో ఆరోగ్యం

రక్తదానంతో ఆరోగ్యం

ఆరిలోవ: రక్తదానం చేసినవారికి ఆరోగ్యంతో పాటు, మానసిక ఆనందం కలుగుతుందని విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(విమ్స్‌) డైరెక్టర్‌ డాక్టర్‌ కె.రాంబాబు అన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని శుక్రవారం విమ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విమ్స్‌ సిబ్బంది చేపట్టిన రక్తదాన అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. సిబ్బంది ప్లకార్డులతో నినాదాలు చేస్తూ విమ్స్‌ పరిపాలనా విభాగం నుంచి జాతీయరహదారి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ రాంబాబు మాట్లాడుతూ ప్రతి ఆరు నెలలకు రక్తదానం చేయడం ఆరోగ్యానికి మంచిదన్నారు. రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నవారవుతారని పేర్కొన్నారు. విమ్స్‌లో ఆరు నెలల నుంచి రక్తనిధి అందుబాటులో ఉందన్నారు. ఇంతవరకు 8 రక్తదాన శిబిరాలు నిర్వహించి వాటి ద్వారా 542 యూనిట్ల రక్తం సేకరించినట్లు వెల్లడించారు. రక్త హీనత, తలసేమియా రోగులకు త్వరలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయనున్నామన్నారు. కార్యక్రమంలో విమ్స్‌ వైద్యులు, సిబ్బంది, నర్సింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement