
బీచ్రోడ్డు దిగ్బంధం
యోగా వేడుకల ఏర్పాట్లు
ఏయూక్యాంపస్: అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్ల నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి బీచ్రోడ్డులో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. యోగా కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తుండటంతో పనులకు ఆటంకం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్.కె.బీచ్ నుంచి వాల్తేర్ డిపో కూడలి వరకు రహదారిని మూసివేయడంతో.. అటువైపుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. ఇక యోగా దినోత్సవం కోసం బీచ్ రోడ్డులో పనులు ఊపందుకున్నాయి. రహదారికి ఇరువైపులా ప్రత్యేక కంపార్ట్మెంట్ల నిర్మాణం, వాటిలో గ్రీన్ మ్యాట్లు పరచడం వంటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీక్షకుల సౌకర్యార్థం ఎల్ఈడీ తెరలను, వాటికి అవసరమైన ఇంటర్నెట్, విద్యుత్ కనెక్షన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆర్.కె.బీచ్ వద్ద ప్రధాన వేదికతో పాటు, ఇసుక తిన్నెలపై మరో భారీ వేదికను నిర్మిస్తున్నారు. భారీగా హాజరయ్యే ప్రజల కోసం మొబైల్ టాయిలెట్లను కూడా అందుబాటులోకి తెచ్చారు. మరోవైపు ఫుట్పాత్లకు, డివైడర్లకు రంగులు వేస్తూ తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. యోగాంధ్ర ప్రచారంలో భాగంగా నగరంలో హోర్డింగులు, బ్యానర్లు వెలిశాయి. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు నగర పోలీసులతో పాటు ఇతర జిల్లాల నుంచి అదనపు బలగాలు విశాఖకు చేరుకున్నాయి. కేంద్ర భద్రతా దళం(ఎస్పీజీ) అధికారులు సైతం ఏర్పాట్లను నిశితంగా పరిశీలిస్తూ, భద్రతాపరమైన సూచనలు అందిస్తున్నారు. తీరం వెంబడి పూర్తిస్థాయిలో పోలీసులను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.
వాహనాల రాకపోకల నిలిపివేత పోలీసుల వలయంలో సాగరతీరం శరవేగంగా యోగా దినోత్సవ ఏర్పాట్లు

బీచ్రోడ్డు దిగ్బంధం

బీచ్రోడ్డు దిగ్బంధం