
రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీలో జిల్లావాసులకు చోటు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీల్లో వివిధ హోదాల్లో పలువురిని నియమించారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శిగా కేవీ బాబా(విశాఖ నార్త్), రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శిగా షేక్ రఫీ అహ్మద్(విశాఖ సౌత్), రాష్ట్ర ఇంటలెక్చువల్ ఫోరం సెక్రటరీలుగా పబ్బరాజు యోకో నారాయణ(గాజువాక), ఎటలపాక విజయ భాస్కర్రావు(విశాఖ సౌత్), రాష్ట్ర అంగన్వాడీ వింగ్ ప్రధాన కార్యదర్శిగా మాసిక లక్ష్మి(విశాఖ నార్త్), రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ సెక్రటరీగా రాజబతల భానుమూర్తి(విశాఖ సౌత్), రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ సెక్రటరీగా గొందేసి సత్యనారాయణ(విశాఖ వెస్ట్)ను నియమించారు.