
సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవ్వాలి
మైలార్దేవ్పల్లి: అనాథలు, వృద్ధులు, మానసిక దివ్యాంగులకు తోడ్పాటు అందిస్తూ వారికి అండగా నిలుస్తున్నామని మానవ సేవే మాధవ సేవా సంస్థ చైర్మన్ ఏర్వ కుమారస్వామి అన్నారు. ఆదివారం మేడిపల్లిలో గల అమ్మ ఆసరా ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి సహకరించిన ఆశ్రమ నిర్వాహకులు మేఘన్, విజయలక్ష్మి, శివలను సంస్థ ప్రతినిధులు సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్వ కుమారస్వామి మాట్లాడుతూ.. సమాజంలో సేవ చేయడం అందరి బాధ్యత అని అన్నారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు కొంపల్లి జగదీష్, గొంత్యాల శ్రీనివాస్, దినేష్, హేమలత, లక్ష్మి, అనిత తదితరులు పాల్గొన్నారు.